చంద్రబాబుపై ముత్యం రెడ్డి, టిడిపి లింగా రెడ్డిపై సిఎం
ఆ తర్వాత సిఎం కిరణ్ మాట్లాడుతుండగా టిడిపి నేతలు పలుమార్లు ఆయన ప్రసంగానికి అడ్డు తగిలే ప్రయత్నాలు చేశారు. లింగా రెడ్డి నిలబడి కిరణ్ ప్రసంగం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఆగ్రహోద్రుడైన కిరణ్ హోప్ లెస్ ఫెలో అంటూ మండిపడ్డారు. దీనికి టిడిపి నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే తాను ఏదైనా అన్ పార్లమెంటరీ పదాలు ఉపయోగిస్తే వాటిని వెనక్కి తీసుకుంటున్నానని ముఖ్యమంత్రి చెప్పారు.
కాగా ఆ తర్వాత చంద్రబాబు సభలో మాట్లాడారు. వ్యవసాయం తీవ్ర సంక్షోభంలో ఉందని అన్నారు. ధాన్యానికి మద్దతు ధర లేక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ప్రభుత్వం స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెసు ప్రభుత్వం హయాంలో రైతులు ఆర్థికంగా చితికి పోతున్నారన్నారు. రాష్ట్రంలోని గోదాములన్నింటిని నిర్మించింది టిడిపియేనన్నారు. నష్టాల్లో ఉన్న విద్యుత్ డిస్కంలకు ఎలా న్యాయం చేస్తారో చెప్పాలని ప్రశ్నించారు. వాస్తవాలు కఠోరంగా ఉంటాయని కాంగ్రెసు వారు కాస్త ఓపిగ్గా వినాలన్నారు. మేం ప్రవేశ పెట్టిన ఈ-సేవను మీరు మీ-సేవగా మార్చారన్నారు. గవర్నర్ ప్రసంగంపై అభ్యంతరం వ్యక్తం చేసిన టిడిపి, సిపిఐ సభ నుండి వాకౌట్ చేశాయి. శాసనసభ గవర్నర్ ప్రసంగాన్ని ఆమోదించింది.