హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రియుడితో పెళ్లి చేయాలని నీళ్ల ట్యాంక్ ఎక్కిన యువతి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Hyderabad
హైదరాబాద్: ప్రేమించిన వ్యక్తితో వివాహం జరిపించాలని ఓ యువతి వాటర్ ట్యాంక్ ఎక్కిన సంఘటన హైదరాబాదులో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి ప్రియుడిని సంఘటనా స్థలానికి తీసుకు రావడంతో ఆమె కిందకు దిగి వచ్చింది. నల్గొండ జిల్లా సూర్యాపేటకు చెందిన రేష్మా అనే యువతి కరీంనగర్ జిల్లా గోదావరిఖనికి చెందిన కుమారస్వామి ప్రేమించుకున్నారు. రేష్మా గర్భం దాల్చడంతో ప్రియుడు కుమారస్వామి మొహం చాటేశాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. తనకు న్యాయం చేయాలని రేష్మా ఉప్పల్ పోలీసు స్టేషన్‌లో నాలుగు రోజుల క్రితం ఫిర్యాదు చేసింది. పెళ్లి చేసుకోమని ఎంతగా చెప్పినా కుమార్ వినలేదు.

దీంతో ఆమె శుక్రవారం కాచిగూడ రైల్వే స్టేషన్ ఎదుట ఉన్న నీళ్ల ట్యాంక్ పైకి ఎక్కి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. దీంతో పోలీసులు వెంటనే కుమారస్వామిని అక్కడకు రప్పించి, అతనిని క్రేన్ ద్వారా పైకి పంపించి రేష్మాను కిందకు దింపారు. ప్రస్తుతం ఇద్దరూ పోలీసుల అదుపులో ఉన్నారు.

English summary
A Teenage Girl climbed water tank at Hyderabad for marriage with her lover.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X