బొత్స సత్యనారాయణ ఉద్వాసనకు ఇన్సైడర్ల ప్లాన్?
మద్యం సిండికేట్లపై అన్ని పార్టీల నుంచి విమర్శలు ఎదుర్కుంటున్న బొత్స సత్యనారాయణ శాసనసభా సమావేశాలకు దూరంగా ఉంటున్నారు. గత రెండు రోజులుగా శానససభకు వస్తున్నప్పటికీ లోనికి ప్రవేశించడం లేదు. బొత్సకు మద్యం సిండికేట్లతో గల సంబంధాలపై, ఆయన కుటుంబ సభ్యులకు ఉన్న మద్యం దుకాణాలపై వివరాలను కాంగ్రెసులోని ఆయన ప్రత్యర్థులు అందిస్తున్నట్లు చెబుతున్నారు. మద్యం సిండికేట్లపై చర్చ ముగిసిన తర్వాత సభలో తనపై వచ్చిన ఆరోపణల మీద శాసనసభలో ప్రకటన చేయడానికి బొత్స సత్యనారాయణ సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది.
మద్యం సిండికేట్లతో సంబంధాలున్న మంత్రులను బర్తరఫ్ చేయాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ సోమవారం గవర్నర్ నరసింహన్కు ఓ వినతిపత్రం సమర్పించింది. బొత్సకు, మోపిదేవికి ఉద్వాసన చెప్పాలని డిమాండ్ చేస్తూ గన్ పార్కు వద్ద ధర్నా చేసేందుకు తెలుగుదేశం సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది.
Comments
botsa satyanarayana pcc president liquor syndicates hyderabad బొత్స సత్యనారాయణ పిసిసి అధ్యక్షుడు మద్యం సిండికేట్లు హైదరాబాద్
English summary
Chief minister N Kiran Kumar Reddy and those Congress leaders opposed to transport minister Botsa Satyanarayana are silently supporting TDP's campaign to effect the ouster of the PCC president and excise minister Mopidevi Venkataramana from the state cabinet.
Story first published: Tuesday, February 28, 2012, 10:42 [IST]