అప్రూవర్గా మారుతా, నన్ను క్షమించండి: రంగారావు
ఎమ్మార్ ప్రాపర్టీస్ కుంభకోణం కేసులో స్టైలిష్ హోమ్స్ తుమ్మల రంగారావుకు గతంలో ముందస్తు బెయిల్ మంజురైంది. ఎమ్మార్ కేసులో బెయిల్ మంజూరైన ఏకైక నిందితుడు తుమ్మల రంగారావు కావడం విశేషం. కొన్ని షరతులో కోర్టు రంగారావుకు అప్పట్లో కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ. 25వేల చొప్పున రెండు పూచీకత్తులతో సిబిఐ కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. తమ అనుమతి లేకుండా హైదరాబాదు విడిచి వెళ్లరాదని కోర్టు రంగారావును ఆదేశించింది. సిబిఐ దర్యాప్తునకు సహకరించాలని సూచించింది.
ఎమ్మార్ ప్రాపర్టీస్ కుంభకోణం కేసులో సిబిఐ ఇప్పటి వరకు నలుగురిని అరెస్టు చేసింది. తుమ్మల రంగారావు అప్పట్లో పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ను సిబిఐ వ్యతిరేకించలేదు. దాన్ని బట్టే రంగారావు అప్రూవర్గా మారేందుకు సిద్ధపడినట్లు ప్రచారం జరిగింది. తుమ్మల రంగారావును అరెస్టు చేయకపోవడంపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు విమర్శలు కూడా చేశారు.