హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అప్రూవర్‌గా మారుతా, నన్ను క్షమించండి: రంగారావు

By Pratap
|
Google Oneindia TeluguNews

CBI
హైదరాబాద్: ఎమ్మార్ కుంభకోణం కేసులో అప్రూవర్‌గా మారడానికి స్టైలిష్ హోమ్స్ డైరెక్టర్ తుమ్మల రంగారావు సిద్ధపడ్డారు. ఈ మేరకు ఆయన మంగళవారం హైదరాబాదులోని నాంపల్లి సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అప్రూవర్‌గా మారేందుకు తనకు అనుమతి ఇవ్వాలని ఆయన కోరారు. తనను క్షమించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్‌పై విచారణను కోర్టు మార్చి 2వ తేదీకి వాయిదా వేసింది.

ఎమ్మార్ ప్రాపర్టీస్ కుంభకోణం కేసులో స్టైలిష్ హోమ్స్ తుమ్మల రంగారావుకు గతంలో ముందస్తు బెయిల్ మంజురైంది. ఎమ్మార్ కేసులో బెయిల్ మంజూరైన ఏకైక నిందితుడు తుమ్మల రంగారావు కావడం విశేషం. కొన్ని షరతులో కోర్టు రంగారావుకు అప్పట్లో కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ. 25వేల చొప్పున రెండు పూచీకత్తులతో సిబిఐ కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. తమ అనుమతి లేకుండా హైదరాబాదు విడిచి వెళ్లరాదని కోర్టు రంగారావును ఆదేశించింది. సిబిఐ దర్యాప్తునకు సహకరించాలని సూచించింది.

ఎమ్మార్ ప్రాపర్టీస్ కుంభకోణం కేసులో సిబిఐ ఇప్పటి వరకు నలుగురిని అరెస్టు చేసింది. తుమ్మల రంగారావు అప్పట్లో పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్‌ను సిబిఐ వ్యతిరేకించలేదు. దాన్ని బట్టే రంగారావు అప్రూవర్‌గా మారేందుకు సిద్ధపడినట్లు ప్రచారం జరిగింది. తుమ్మల రంగారావును అరెస్టు చేయకపోవడంపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు విమర్శలు కూడా చేశారు.

English summary
Stylish Homes director Tummala Ranga Rao filed petition in CBI court seeking permission to turn as approver in EMAAR case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X