హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అడ్డొస్తే అడ్డంగా నరుకుతా: ముఖేష్‌కు అంజన్ హెచ్చరిక

By Srinivas
|
Google Oneindia TeluguNews

Anjan Kumar Yadav
హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో తాను సికింద్రాబాద్ పార్లమెంటు అభ్యర్థిగానే పోటీ చేస్తానని, ఎవరైనా అడ్డొస్తే అడ్డంగా నరికేస్తానని ఎంపి అంజన్ కుమార్ యాదవ్ మంత్రి ముఖేష్ గౌడ్‌ను బుధవారం హెచ్చరించారు. సికింద్రాబాద్ నుండి ప్రజలు తనను ఎన్నుకున్నారు కాబట్టి అది తన జాగీరేనని ముఖేష్‌కు కౌంటర్ వేశారు. వచ్చే ఎన్నికల్లోనూ అక్కడి నుండే పోటీ చేస్తానని చెప్పారు. ఎన్నికలకు మరో రెండేళ్ల సమయం ఉండగానే ముఖేష్ మతిస్థిమితం లేకుండా మాట్లాడుతున్నారని విరుచుకు పడ్డారు. సికిందరాబాద్, ముషీరాబాద్ నియోజకవర్గాలకు ఇప్పుడు నోటిఫికేషనో, మధ్యంతరమో రాలేదు కదా అన్నారు. సికిందరాబాద్ నా సీటు అన్నారు. భారతీయ జనతా పార్టీకి చెందిన మహా నాయకుడు బండారు దత్తాత్రేయపై పోటీ చేసేందుకు అందరూ వెనుకాడుతున్న సమయంలో తాను ధైర్యంగా బరిలోకి దిగానన్నారు.

అప్పుడు రాకుండా ఇప్పుడు మాట్లాడటమేమిటన్నారు. ప్రజలే నా దేవుళ్లని వారే నన్ను రెండుసార్లు గెలిపించారు మళ్లీ గెలిపిస్తారన్నారు. ముషీరాబాద్ ఆఫర్ చేయడానికి ముఖేష్ ఎవరని ప్రశ్నించారు. తన పార్లమెంటు నియోజకవర్గంలోని అసెంబ్లీ స్థానం పోటీ చేయాల్సి వస్తే వారే నన్ను అడగాలన్నారు. గ్రేటర్లో మరో బిసి ఎదగకుండా ముఖేష్ అడ్డుపడుతున్నారన్నారు. తెలుగుదేశం పార్టీ నేత దేవేందర్ గౌడ్‌తో ఆయన ఫిక్సింగ్ చేసుకున్నారన్నారు. అమ్మవారి దయతో మళ్లీ నేనే పోటీ చేసి గెలుస్తానన్నారు.

English summary
MP Anjan Kumar Yadav warned minister Mukesh Goud today. He said he will contest from same constituency in 2014 elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X