గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నాన్నే ఉంటే కష్టాలుండేవి కావు!: బాధేస్తుందన్న జగన్

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan
గుంటూరు: ప్రస్తుతం రాష్ట్ర పరిస్థితులు చూస్తుంటే తనకు చాలా బాధేస్తుందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం అన్నారు. జిల్లాలో జగన్ ఓదార్పు యాత్ర డెబ్బయ్యవ రోజు కొనసాగుతోంది. గరికపాడులో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ప్రస్తుతం దారుణంగా ఉందన్నారు. చూస్తుంటే బాధేస్తుందన్నారు. వరి వేసుకోవడం కంటే ఉరి మేలని రైతులు చెబుతున్నారని ఆవేదవ వ్యక్తం చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి బతికి ఉంటే తమకు ఇన్ని కష్టాలు వచ్చి ఉండేవి కావని రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఒక్కరి నోటి నుండి వినిపిస్తోందన్నారు. అధికార కాంగ్రెసు, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలు కుమ్మక్కై రాజకీయాలు చేస్తున్నాయని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రజలంతా రెండు పార్టీలను గమనిస్తున్నారన్నారు.

కాగా గరికపాడులో జగన్ వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అక్కడకు రావాల్సిన సమయానికి కన్నా ఆయన ఐదు గంటలు ఆలస్యంగా వచ్చారు. ఉదయం బాలాజీ ఎస్టేట్స్ నుండి జగన్ ఓదార్పు యాత్ర ప్రారంభమైంది. అక్కడి నుండి గరికపాడు వచ్చి మూడు వైయస్ విగ్రహాలను ఆవిష్కరించారు. ఓ కుటుంబాన్ని ఓదార్చారు. ఆ తర్వాత గుమ్మనంపాడు, రేమిడిచర్ల, బొల్లాపల్లి, సంగినీడుపాలెం తదితర గ్రామాల్లో పలు వైయస్ విగ్రహాలు ఆవిష్కరిస్తారు.

English summary
YSR Congress Party chief YS Jaganmohan Reddy felt very sad for present situations in state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X