గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

డ్రైవర్ వేధింపులతో యువతి ఆత్మహత్య, సైకో మరో దాడి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Nalgonda Map
నల్గొండ/గుంటూరు: నల్గొండ జిల్లాలోని నూతకల్ మండలం మిర్యాల గ్రామంలో డ్రైవర్ వేధింపులు భరించలేక ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. మిర్యాల గ్రామానికి చెందిన సుమలత సూర్యాపేటలోని వికాస్ కళాశాలలో బి ఫార్మసీ చదువుతోంది. ఆమె రోజు కళాశాలకు బస్సులో లేదా ఆటోలో వెళ్లి వస్తుంది. ఆమె ప్ర్రయాణిస్తున్న సమయంలో ఓ ఆటో డ్రైవర్ నగేష్ తన స్నేహితులతో కలిసి రోజు వేధిస్తుండే వాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. గతంలో ఓసారి నగేష్‌ను మందలించారు. అయినప్పటికీ సుమలతను వేధించడం ఆపలేదు. అతని ఆగడాలు తట్టుకోలేక తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సుమలత సూసైడ్ నోట్ రాసి గురువారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. నగేష్ కూడా మిర్యాల గ్రామానికి చెందిన వ్యక్తే. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.

గుంటూరు జిల్లాలో మరో సైకో దాడి చేశాడు. ఓ ఇంట్లో బాత్ రూంలో దూరిన అంగంతకుడు యువతిపై బ్లేడుతో దాడి చేసి గొంతు కోసే ప్రయత్నం చేశాడు. ఈ ఘటన తెనాలిలోని ఇస్లాంపేటలో జరిగింది. సైకో దాడి జరగలేదని వివాహేతర సంబంధం కారణంగానే సదరు యువకుడు యువతిపై బ్లేడుతో దాడి చేశారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ దాడిలో యువతికి స్వల్ప గాయాలయ్యాయి. ఆమెను ఆసుపత్రికి తరలించారు. కాగా సైకో దాడి వార్తలు అవాస్తవమని, ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురి కావొద్దని పోలీసులు చెబుతున్నారు.

English summary
B.Pharmacy student committed to suicide today in Nalgonda district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X