వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కిడ్నాప్‌కు గురైన ఇంజనీరింగ్ విద్యార్థి దారుణ హత్య

By Srinivas
|
Google Oneindia TeluguNews

Mahaboobnagar
మహబూబ్ నగర్: నాలుగు రోజుల క్రితం మహబూబ్ నగర్ జిల్లా గద్వాలలో ఇంజనీరింగ్ విద్యార్థి బద్రీనాథ్ కిడ్నాప్ ఉదంతం విషాదాంతం అయింది. ఇంజనీరింగ్ విద్యార్థి బద్రీనాథ్ దారుణ హత్యకు గురయ్యాడు. ఆయన మృతదేహాన్ని గద్వాల మండలం కృష్ణ అగ్రహారం వద్ద రైల్వే ట్రాక్ పైన పడవేశారు. బద్రీనాథ్ హత్య కేసులో నిందితుడు ఖాజాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనే హత్య చేసినట్లు ఒప్పుకున్నట్లుగా సమాచారం. హత్యకు దారితీసిన కారణాలు ఇంకా బయటకు రాలేదని పోలీసులు చెప్పారు.

బద్రీనాథ్ గద్వాల్ కు చెందిన బట్టల వ్యాపారి వెంకట స్వామి తనయుడు. అతను బిటెక్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఆదివారం రాత్రి మొదటి ఆట సినిమాకు వెళ్లి వస్తుండగా కిడ్నాప్‌కు గురయ్యాడు. రాత్రి ఎంత సేపటికి బద్రీనాథ్ ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు కలత చెందారు. సోమవారం ఉదయం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కాగా నిందితుడు డబ్బుల కోసమే హత్య చేసినట్లు తెలుస్తోంది. తండ్రికి ఫోన్ చేసి రూ.25 లక్షల డబ్బు అడిగినట్లుగా తెలుస్తోంది.

English summary
Engineering student Badrinath kidnap ended as tragedy in Mahaboobnagar today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X