వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాలుడి వేళ్లు నమిలిన మహిళ: జైలులో సంఘటన

By Pratap
|
Google Oneindia TeluguNews

Ajmer City
అజ్మీర్: నాలుగేళ్ల బాలుడి వేళ్లను నమిలిన 35 ఏళ్ల మహిళ ఉదంతం అజ్మీర్ సెంట్రల్ జైలులో బుధవారం చోటు చేసుకుంది. తన కుమారుడిని రైలు నుంచి తోసిసేన కేసులో బర్ఫీ అనే మహిళ జైలులో ఉంటుంది. జైలు శిక్ష అనుభవిస్తున్న మరో మహిళతో ఆమె కుమారుడు ఉంటున్నాడు. బర్ఫీ బారి నుంచి తన కుమారుడిని కాపాడడానికి ఆ మహిళ ప్రయత్నించింది. ఆ సమయంలో బర్ఫీ ఆ మహిళపై కూడా దాడి చేసింది.

బర్ఫీపై జైలు అధికారులు సివిల్ లైన్స్ పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేసి, బాధితులను జెఎల్ఎన్ ఆస్పత్రికి తరలించారు. భోజన విరామ సమయంలో సల్మా తన ఆహారాన్ని తీసుకోవడానికి వెళ్లినప్పుడు ఆమె కుమారుడు అర్మాన్ ఆడుకుంటున్నాడు. ఆ సమయంలో బర్ఫీ అర్మాన్‌పై దాడి చేసింది. బర్ఫీ తన కుమారుడిని చూసి కొట్టడం ప్రారంభించిందని, ఆ తర్వాత అతని వేళ్లను నమిలిందని సల్మా చెప్పింది.

బర్ఫీ తనపై దాడి చేయడంతో అర్మాన్ దిగ్భ్రాంతికి గురయ్యాడు. అప్పటి నుంచి అతని నోట మాట రావడం లేదు. నెల రోజుల క్రితం బర్ఫీ జైపూర్, అజ్మీర్ మధ్య తన కుమారుడిని రైలు నుంచి తోసేసింది. పోలీసులు అరెస్టు చేసి జైలులో పెట్టిన తర్వాత ఓ మూల గంటల విచారంగా కూర్చుంటూ ఉండేది. అర్మాన్‌ను చూస్తే మండిపోయేదని అంటున్నారు.

English summary
A 35-year-old woman chewed off the fingers of a four-year-old-boy in Central Jail in Ajmer on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X