వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఖైరతాబాద్ వదిలేది లేదు: పిజెఆర్ కూతురు విజయ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Charminar
హైదరాబాద్: తాము ఖైరతాబాద్ స్థానాన్ని వదిలేది లేదని దివంగత నేత పి.జనార్ధన్ రెడ్డి కూతురు విజయా రెడ్డి ఆదివారం స్పష్టం చేశారు. ఎక్కడి నుంచో వచ్చిన వారు ఇక్కడ మంత్రులుగా వెలగబెడుతున్నారని ఆమె ధ్వజమెత్తారు. ప్రజా సమస్యలు వదిలేసి మంత్రులు విదేశీ పర్యటనలకు వెళుతున్నారని ఆమె ఆరోపించారు. అధికారంలో ఉండి కూడా ప్రజా సమస్యలను విస్మరిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తన తండ్రి బాటలో నడుస్తూ తాము పిజెఆర్ ఫౌండేషన్ ద్వారా ప్రజలకు సేవ చేస్తామని ఆమె స్పష్టం చేశారు.

కాగా ఖైరతాబాద్ నియోజకవర్గం నుండి పలుమార్లు ప్రాతినిథ్యం వహించిన పి.జనార్ధన్ రెడ్డి 2007 డిసెంబర్ 28న మృతి చెందిన విషయం తెలిసిందే. పిజెఆర్‌కు తన నియోజకవర్గంలో చాలా మంచి పేరు ఉంది. పేదలకు సహాయం చేసే వారని, ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే వారని స్థానికులు అంటారు. ఆయన నియోజకవర్గంలో ఆయన పట్ల ఏమాత్రం వ్యతిరేకత లేక పోవడం గమనార్హం. అతను 1978, 1985, 1989, 1994, 2004 మొత్తం ఐదుసార్లు ఖైరతాబాద్ నుండి గెలుపొందారు. ఆయన మృతి తర్వాత ఆయన తనయుడు విష్ణువర్దన్ రెడ్డి జూబ్లీహిల్స్ నుండి పోటీ చేసి గెలుపొందారు. సిఎల్పీ లీడర్‌గా కూడా ఆయన పని చేశారు.

English summary
Late P Janardhan Reddy's daughter Vijaya Reddy said that they will not withdraw from Khairatabad constituency.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X