హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణకు చిరంజీవి రావొద్దు: కాంగ్రెసు నేతల ఝలక్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
హైదరాబాద్: తిరుపతి శాసనసభ్యుడు చిరంజీవి తెలంగాణ ప్రచారంపై ఆ ప్రాంత కాంగ్రెసు పార్టీ నేతలు మండిపడుతున్నారు. తెలంగాణలోని ఆరు ఉప ఎన్నికలు జరుగుతున్న నియోజకవర్గాలకు చిరంజీవి ప్రచారానికి వస్తే తాము వచ్చేది లేదని మాజీ మంత్రి, ఖమ్మం జిల్లా శాసనసభ్యుడు రాంరెడ్డి వెంకట రెడ్డి స్పష్టం చేశారు. ఆయన కనుక ప్రచారం చేస్తే పార్టీ గెలుపు కోసం తాము చేపట్టదల్చుకున్న బస్సు యాత్రను కూడా రద్దు చేసుకుంటామని హెచ్చరించారు. ఆయన ప్రచారానికి వెళ్తే తాము ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్లేది లేదని చెప్పారు. ఆయన ఏ హోదాలో ప్రచారానికి వస్తారని ఆయన ప్రశ్నించారు. ప్రజారాజ్యం పార్టీ అధినేతగా ఆయన తెలంగాణకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నారని, ఇప్పుడు ఆయన ప్రచారానికి వస్తే పార్టీకి, అభ్యర్థుల గెలుపుకు నష్టం కలిగిస్తుందే కానీ ఎలాంటి లాభం కలిగించదని అన్నారు. చిరంజీవిని ప్రచారానికి పంపించవద్దని పలువురు సీనియర్లు పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు కూడా చేశారు.

కాగా ఈ నెల పద్దెనిమిదో తారీఖున తెలంగాణలోని ఆరు, శ్రీ పొట్టి శ్రీరాములు నియోజకవర్గం కొవ్వూరు నియోజకవర్గంలో ఉప ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ ఉప ఎన్నికల ప్రచారానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, తిరుపతి శాసనసభ్యుడు చిరంజీవి తదితర ముఖ్య నేతలు వస్తున్నారు. చిరంజీవి రూట్ ప్లాన్ పార్టీ సిద్ధం కూడా చేసింది. అయితే చిరంజీవి రావడంపై తెలంగాణ నేతలు మాత్రం మండిపడుతున్నారు. ఏకంగా పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు.

English summary
Telangana Congress leaders complained against Chiranjeevi to party High Command today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X