నెల్లూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఉప ఫలితాలతో ఢిల్లీకి అర్థం కావాలి: వైయస్ జగన్

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
నెల్లూరు: ఉప ఎన్నికల ఫలితాలతో రాష్ట్ర ప్రభుత్వం కళ్లు తెరవాలని, ఢిల్లీకి కూడా అర్థం కావాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ అన్నారు. నెల్లూరు జిల్లా కోవూరు శానససభా నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డితో కలిసి ఆయన సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాష్ట్రంలో పరిస్థితులు దిగజారాయని, పేదల చదువులను పట్టించుకునే నాథుడే లేడని, రైతుల పరిస్థితి అధ్వాన్నంగా ఉందని ఆయన అన్నారు. ప్రజలు తమ పార్టీ వైపు చూస్తున్నారని, పేదల కోసమే తమ పార్టీ వచ్చిందని, ఉప ఎన్నికలు ఎందుకు వచ్చాయో ప్రజలు అర్థం చేసుకోవాలని ఆయన అన్నారు.

రాష్ట్రంలో కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు కుమ్మక్కయి నీచ రాజకీయాలకు పాల్పడుతున్నాయని ఆయన విమర్శించారు. మూడో పార్టీ గానీ మూడో వ్యక్తి ఉండకూడదని ఆ రెండు పార్టీలు రాజకీయాలు చేస్తున్నాయని ఆయన అన్నారు. రైతుల కోసం తమ శానససభ్యులు రాజీనామాలు చేశారని, ఉప ఎన్నికలు వస్తే మంత్రులు వస్తారు, డబ్బుల మూటలు పంచుతారని తెలిసి కూడా ఎన్నికలకు సిద్ధపడ్డారని ఆయన అన్నారు. రాష్ట్రంలో మూడో పార్టీ ఉండకూడదా అని ఆయన ప్రశ్నించారు. ఖాళీ అయిన 17 స్థానాలకు ఇంచార్జీలను త్వరలో నియమిస్తామని ఆయన చెప్పారు.

English summary
YSR Congress party president YS Jagan has lashed out at Congress and Telugudesam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X