హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆ డబ్బు జగన్‌కు ఇచ్చాడో తెలియాలి: సునీల్‌పై సిబిఐ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Sunil Reddy
హైదరాబాద్: ఎమ్మార్ కేసులో అరెస్టైన సునీల్ రెడ్డి అధిక మొత్తంలో సేకరించిన డబ్బును ఎవరికి ఇచ్చారో తెలియాల్సి ఉందని సిబిఐ తరఫు న్యాయవాది మంగళవారం కోర్టులో వాదించారు. సునీల్ రెడ్డి బెయిల్ పిటిషన్ పైన ఉదయం సిబిఐ ప్రత్యేక న్యాయస్థానంలో విచారణ జరిగింది. ఇరువురి వాదనలు విన్న అనంతరం బెయిల్ పైన విచారణను కోర్టు పదహారో తేదికి వాయిదా వేసింది. ఈ సందర్భంగా సిబిఐ తరఫు న్యాయవాది... ఎమ్మార్ వ్యవహారంలో సునీల్ రెడ్డి వసూలు చేసిన డబ్బు ఎవరికి ఇచ్చారో ఇంకా చెప్పలేదన్నారు. అది తెలియాల్సి ఉందని చెప్పారు. ఆ డబ్బును వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చారో లేక ఇంకా ఎవరికి ఇచ్చారో తెలియాల్సి ఉందని ఆయన వాదించారు.

సునీల్ రెడ్డి వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు అని ఈ సందర్భంగా చెప్పారు. 2004 సంవత్సరం వరకు రూ. రెండు లక్షల ఆదాయం ఉన్న సునీల్ రెడ్డి 2011 సంవత్సరానికి రూ.99 లక్షల ఆదాయానికి పెరిగిందన్నారు. ఇది ఎలా జరిగిందో తెలుసుకోవాల్సి ఉందని చెప్పారు. కాగా ఎమ్మార్ కేసులో సునీల్ రెడ్డిని సిబిఐ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. సునీల్ రెడ్డి బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు.

English summary
CBI special court adjourned Sunil Reddy's bail petition today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X