వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మణిపూర్ మళ్లీ కాంగ్రెస్‌దే, 4వ స్థానంలో ఖుర్షీద్ భార్య

By Srinivas
|
Google Oneindia TeluguNews

Manipur Map
న్యూఢిల్లీ: మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ అభ్యర్థి బోణీ కొట్టారు. తిపైముఖ్ నియోజకవర్గం కాంగ్రెసు అభ్యర్థి చలోన్లెన్ ఆమో విజయం సాధించారు. ఆయన 912 ఓట్లతో తన సమీప తృణమూల్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి ఫిమాట్‌పై విజయం సాధించారు. మణిపూర్‌లో కాంగ్రెసు పార్టీ సంపూర్ణ ఆధిక్యం దిశగా వెళుతోంది. 60 స్థానాలు ఉన్న మణిపూర్‌లో కాంగ్రెసు 29 స్థానాల్లో గెలుపొందింది. ఉత్తరాఖండ్‌లో బిజెపి అభ్యర్థి బోణీ కొట్టారు. సితార్ గంజ్ స్థానం నుండి బిజెపి అభ్యర్థి కిరణ్ చంద్ర మండల్ గెలుపొందారు. ఉత్తరాఖండ్‌లోనూ కాంగ్రెసు పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశలో సాగిపోతోంది. బిజెపి 27, బిఎస్పీ 7, కాంగ్రెసు 31 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. గోవా, పంజాబ్ రాష్ట్రాలలో బిజెపి, దాని మిత్ర పక్షాలు ముందంజలో ఉన్నాయి.

కాగా ఉత్తర ప్రదేశ్ లోని ములాయం సింగ్ యాదవ్ సొంత నియోజకవర్గం అయిన ఎటావాలో సమాజ్ వాది పార్టీ అన్ని స్థానాల్లోనూ ముందంజలో ఉంది. కేంద్ర న్యాయశాఖ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ భార్య లూయీ ఖూర్షీద్ యుపి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. నాలుగు రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు ఆమె నాలుగో స్థానంలో ఉన్నారు. కాగా కడపటి సమాచారం అందే సమయానికి ఉత్తర ప్రదేశ్‌లో ఎస్పీ 178, బిఎస్పీ 99, కాంగ్రెస్ 53, బిజెపి 57 స్థానాల్లో ముందంజలో ఉంది. ఇక మణిపూర్‌లో కాంగ్రెసు 9, తృణమూల్ కాంగ్రెసు 1, పంజాబ్ లో కాంగ్రెసు 2 స్థానాలు గెలుపొందింది.

కాగా కడపటి సమాచారం అందే సమయానికి మణిపూర్ లో కాంగ్రెసు పార్టీ అధికారాన్ని నిలబెట్టుకుంది. అక్కడ కాంగ్రెసు పార్టీ 29 స్థానాలలో గెలుపొంది, పన్నెండు స్థానాలలో ఆధిక్యంలో ఉంది. అరవై స్థానాలు కలిగిన ఇక్కడ కాంగ్రెసు మరోసారి అధికారంలోకి రానుంది.

English summary
Assembly Elections Results 2012, Early trends show lead for BJP and SP in UP, Congress in Punjab.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X