ఆ నియోజకవర్గాల్లో సోనియా, రాహుల్ భవిష్యత్తేంటి?
ఈ నేపథ్యంలో 2014లో వచ్చే సాధారణ ఎన్నికల్లో సోనియా, రాహుల్ గాంధీలు నియోజకవర్గాలు మారాలా? లేక రెండు నియోజకవర్గాలలో పోటీ చేయాలా? అనే అంశం ప్రధానంగా తెరపైకి వచ్చింది. వారి పార్లమెంటు పరిధిలోని మెజార్టీ నియోజకవర్గాల్లో విపక్షాలు గెలుపొందడంతో సోనియా, రాహుల్ గెలుపు కష్టంగా మారనుందని అంటున్నారు. ఒకవేళ గెలిచినా అది బోటాబోటీ మెజార్టీతో మాత్రమే గెలిచే అవకాశాలు ఉంటాయని అంటున్నారు. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ హయాం నుండి గాంధీ కుటుంబాలకు పట్టం కట్టిన రాయ్బరేలి ప్రజలు ఈసారికి కొత్తగా పుట్టుకు వచ్చి పీస్ పార్టీకి పట్టం కడుతున్నారు. తాజాగా ఎన్నికల బరిలోకి దిగిన పీస్ పార్టీ కాంగ్రెసును చావుదెబ్బ కొట్టిందనే చెప్పవచ్చు. ఈ నియోజకవర్గాలలో ముస్లింల జనాభా అధికంగా ఉంటుంది. 2014లో పార్లమెంటు స్థానాలకు పీస్ పార్టీ పోటీ చేసిన పక్షంలో సోనియా, రాహుల్ గెలుపు క్లిష్టంగా మారనుందని అంటున్నారు. అయితే అసెంబ్లీ ఫలితాలు పార్లమెంటు ఎన్నికలపై ప్రభావం చూపయని మరికొందరు అంటున్నారు. ఆ నియోజకవర్గాలలో వారికి ఎలాంటి ఢోకా లేదని అంటున్నారు.