ఏడాదిలో సునీల్ రెడ్డికి రూ. 50 కోట్లు వచ్చాయి: సిబిఐ
సునీల్ రెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై మంగళవారం నాంపల్లి సీబీఐ కోర్టులో వాదనలు సాగాయి. ఎమ్మార్ కేసులో విల్లాల విక్రయాల ద్వారా వచ్చిన సొమ్మును సునీల్రెడ్డి తన కోసమే వసూలు చేశారా? వేరెవరి కోసమైనా ఆ పని చేశారా? అని న్యాయమూర్తి నాగమారుతీ శర్మ ప్రశ్నించారు. దీనికి రవీంద్రనాథ్ బదులిస్తూ - "తుమ్మల రంగారావు, ఆయన అకౌంటెంట్ శ్రీనివాసరావు వద్ద తీసుకున్న విల్లాల సొమ్ము రూ.96 కోట్లు ఎక్కడికి వెళ్లాయన్నది తేలలేదని, దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు.
సునీల్ రెడ్డికి రాజకీయంగా పలుకుబడి ఉందని, జగన్తో, అప్పటి సీఎంతోనూ సునీల్ రెడ్డికి సాన్నిహిత్యం ఉందని, బెయిల్ ఇస్తే కేసును ఆయన ప్రభావితం చేయవచ్చునని వాదించారు. తాను అమాయకుడనని సునీల్రెడ్డి భావిస్తే నార్కో అనాలసిస్కు ఒప్పుకోవాలని సూచించారు. వాస్తవానికి, 2004-10 మధ్య కాలంలో తమ కుటుంబానికి రూ.99 లక్షల ఆదాయం వచ్చినట్లు ఆదాయ పన్ను రిటర్నుల్లో సునీల్ రెడ్డి పేర్కొన్నారని, కానీ, దానికి మూడు రెట్లు ఆస్తులు ఉన్నట్లు తమ దర్యాప్తులో తేలిందని కోర్టుకు విన్నవించారు.