హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ పార్టీకి ఎస్సెమ్మెస్‌ల బెడద, ఖండించిన పార్టీ

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి ఓటు వేయాలంటూ ఎస్సెమ్మెస్‌లు సెల్ ఫోన్లలో షికారు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థికి ఓటు వేయండని, ఈ మెసేజ్‌ను మరో పదిహేను మందికి పంపితే మీ సెల్ ఫోన్‌కి ఐదువందల రూపాయల బ్యాలెన్స్ వస్తుందని ఎస్సెమ్మెస్‌లు వెళ్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ ఎస్సెమ్మెస్‌లపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తీవ్రంగా స్పందించింది. ఈ ఎస్సెమ్మెస్‌లకు తమ పార్టీకి గాని, తమ పార్టీ అభ్యర్థి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి కాని ఎలాంటి సంబంధం లేదని ఆ పార్టీ కన్వీనర్ పిఎన్‌వి ప్రసాద్ తెలిపారు.

ఈ ఎస్ఎంఎస్ వెనుక తెలుగుదేశం పార్టీ కుట్ర ఉండి ఉండవచ్చునని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. అంతేకాక ఈ ఎస్ఎంఎస్‌లో మరిన్ని వివరాలకు సాక్షి టెలివిజన్ చూడాలంటూ తప్పుడు సమాచారాన్ని కూడా అందరికీ ఎస్ఎంఎస్‌లు పంపుతున్నారని ఆయన తెలిపారు. దీనిపై వెంటనే తాము ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు.

English summary
YSR Congress Party condemned SMSs, in favour of Nallapureddy Prasanna Kumar Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X