వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తీర్పు శిరసా వహిస్తా: రాజీనామా తర్వాత మాయావతి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Mayawati
లక్నో: ఉత్తర ప్రదేశ్ ప్రజలు ఇచ్చిన తీర్పును తాను శిరసావహిస్తానను బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి బుధవారం లక్నోలో మీడియాతో అన్నారు. ఆమె గవర్నర్ ను కలిసి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. తాను ప్రజా తీర్పును శిరసావహిస్తానని ఆమె అన్నారు. సమాజంలో అన్ని వర్గాల అభివృద్ధికి పాటు పడ్డానని చెప్పారు. రాష్ట్రంలో విద్యుత్ సమస్యలు పరిష్కరించానని అన్నారు. యుపి అభివృద్ధికి కేంద్రం సహకరించలేదన్నారు. అధికారం చేపట్టపోయే పార్టీ బహుజనులను విస్మరిస్తుందన్నారు. తాము నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరిస్తామని చెప్పారు. రాష్ట్రంలో బిఎస్పీ ఎన్నో మార్పులు తెచ్చిందన్నారు. కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్ల పేరుతో స్వార్థ రాజకీయాలకు పాల్పడిందని విమర్శించారు. దళితులు, ముస్లింలు ఇప్పటికీ తమ వెంటే ఉన్నారని చెప్పారు.

కాంగ్రెసు, బిజెపిలలో బహుజనులకు న్యాయం జరగటం లేదన్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చాయని, కానీ తమ పార్టీకి ఓటింగ్ శాతం మాత్రం తగ్గలేదని ఆమె అభిప్రాయపడ్డారు. తన హయాంలో అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యం ఇచ్చామన్నారు. ముస్లింల అభివృద్ధికి తోడ్పడ్డామన్నారు. ఐదేళ్లలో మంచి పాలన అందించామని ఆమె అన్నారు. ఓటమికి తానే బాధ్యత వహిస్తానని అన్నారు. కాంగ్రెసు, బిజెపి రాజకీయ స్వార్థం వల్లే ముస్లింలు ఎస్పీ వైపు మొగ్గారన్నారు. విధాన సభను రద్దు చేయాలని గవర్నర్‌కు సూచించానని చెప్పారు.

English summary
BSP chief Mayawati resigned for her CM post today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X