కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తాగిన మైకంలో మిస్‌ఫైర్: తుపాకి పేలి ఒకరి మృతి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Charminar
హైదరాబాద్: తాగిన మైకంలో ఓ వ్యక్తి చేతిలోని తుపాకి మిస్ ఫైర్ కావడంతో ఒకరు మృతి చెందిన సంఘటన హైదరాబాదులో గురువారం రాత్రి చోటు చేసుకుంది. మెదక్ జిల్లాలోని రామచంద్రపురం మండలం లింగంపల్లిలో ఎస్ఎన్ గార్డెన్స్‌ ఫంక్షన్ హాలులో జరుగుతున్న ఓ పెళ్లి వేడుకలో ఈ అపశృతి చోటు చేసుకుంది. నర్సింహా రెడ్డి అనే రియాల్టర్ చేతిలోని తుపాకి పేలి రాజేందర్ రెడ్డి అనే వ్యక్తి మృతి చెందాడు. వీరిద్దరూ దూరపు బంధవులు. నర్సింహా రెడ్డి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తుంటాడు. రాజేందర్ రెడ్డి పూల వ్యాపారి. వీరిద్దరితీ కరీంనగర్ జిల్లా. రాజేందర్‌ది కరీంనగర్ లోని బండలింగపల్లి గ్రామం. ఇతను గుడిమల్కాపూరంలో వ్యాపారం చేస్తుంటాడు.

రాత్రి రాజేందర్ రెడ్డికి నర్సింహా రెడ్డి తన తుపాకిని చూపిస్తుండగా మిస్ ఫైర్ అయింది. దీంతో అతనిని వెంటనే రెమెడీ హాస్పిటల్ కు తరలించారు. చికిత్స పొందుతూ రాజేందర్ రెడ్డి మృతి చెందాడు. అయితే వారు ఆ సమయంలో తాగి ఉన్నారని తెలుస్తోంది. రాజేందర్ మృతి చెందడంతో నర్సింహా రెడ్డితో పాటు అతని కూడా ఉన్న స్నేహితులు పరారయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు. అయితే మిస్ ఫైర్ అయిందా కావాలనే చంపి మద్యం మత్తులో అని అంటున్నారా అనే కోణంలోనూ పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు. నర్సింహ రెడ్డికి తుపాకి ఎక్కడిది, లైసెన్స్ ఉందా అనే కోణంలోనూ పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు.

English summary
A Flower businessman Rajender Reddy killed by misfire at Lingampalli of Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X