చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎయిర్‌పోర్టులో 2కిలోల డ్రగ్స్‌తో పట్టుబడ్డ భార్యాభర్తలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Hyderabad
హైదరాబాద్: నగరంలో మరో డ్రగ్స్ ముఠా ఆదివారం పట్టుబడింది. మాదక ద్రవ్యాలు తరలిస్తున్న దంపతులను శంషాబాద్ విమానాశ్రయంలో పోలీసులు పట్టుకున్నారు. వరలక్ష్మి, పిచ్చయ్య అనే దంపతులు తమ వద్ద డ్రగ్స్‌తో బ్యాంకాక్ వెళ్లేందుకు పయనమయ్యారు. అధికారులు చెక్ చేయడంతో వారి వద్ద డ్రగ్స్ ఉన్నట్టు బయటపడింది. రెండు కిలోల టెటామిన్ అనే మాదక ద్రవ్యాన్ని అధికారులు వారి నుండి స్వాధీనం చేసుకున్నారు. వారు చెన్నైకి చెందిన వారు. డ్రగ్స్ తో ఉన్న ఇద్దరిని అరెస్టు చేసినట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు. అదుపులోకి తీసుకున్న వారిని పోలీసులు విచారిస్తున్నారు.

కాగా ఇటీవలి కాలంలో హైదరాబాదు నగరంలో మత్తుపదార్థాలతో చాలామంది పట్టుపడుతున్నారు. విద్యార్థులు, యువతను టార్గెట్ గా చేసుకొని పలువురు మత్తుపదార్థాలు విక్రయిస్తున్నారు. ప్రధానంగా విదేశీయులు డ్రగ్స్‌తో ఇటీవలి కాలంలో పలువురు పట్టుబడ్డారు. దీంతో పోలీసులు పదిహేను రోజుల క్రితం హైదరాబాదులోని పలు విదేశీయుల ఇళ్లలో సోదాలు నిర్వహించారు.

English summary
Hyderabad police arrested a couple today for drugs transport from Hyderabad to Bangkok.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X