సైకిల్దే హవా: కెసిఆర్,జగన్పై ఒంటికాలిపై లేచిన బాబు
వైయస్ జగన్మోహన్ రెడ్డి దగ్గర డబ్బులు తీసుకొని గులాం గిరి చేస్తున్నారని అన్నారు. జగన్ అవినీతి రాజా అయితే కెసిఆర్ వసూల్ రాజా అన్నారు. టిడిపి జోలికొస్తే మాడి మసైపోతావని కెసిఆర్ను హెచ్చరించారు. కెసిఆర్కు నన్ను గాని, టిడిపిని గాని విమర్శించే నైతిక హక్కు లేదన్నారు. అవకాశవాద రాజకీయాలు చేస్తున్న కెసిఆర్ వద్దకు గంప గోవర్ధన్ వెళ్లాడని ఆయనకు ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పాలన్నారు. రాజకీయ జన్మనిచ్చిన పార్టీకి గంప గోవర్ధన్ ద్రోహం చేశారన్నాడు. కెసిఆర్ కు మంత్రి పదవి ఇచ్చి ఉంటే పార్టీ పెట్టే వాడు కాదన్నారు. వ్యవసాయం లాభ సాటి అయ్యే వరకు టిడిపి రైతులకు అండగా ఉంటుందన్నారు. కాంగ్రెసు పార్టీ దొంగలు రాబందుల్లా ప్రజా సంపదను మెక్కేశారన్నారు. యుపిలో సైకిల్ గెలిచిందని, భవిష్యత్తులో ప్రాంతీయ పార్టీలదే హవా అన్నారు.
2002లో గోద్రా అల్లర్ల సమయంలోనే తాను బిజెపికి మద్దతు ఉపసంహరించుకుంటే ముస్లింలలో తాను చిరస్థాయిగా నిలిచి పోయేవాణ్ణని అన్నారు. టిడిపి అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు రూ.1000 భృతి ఇస్తుందన్నారు. గల్ఫ్ బాధితులకు ప్రత్యేక ప్యాకేజీ కేటాయిస్తామని చెప్పారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్సుమెంట్స్ పూర్తిస్థాయిలో అమలు చేస్తామని చెప్పారు. కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా పని చేసిన కెసిఆర్ బీడీ కార్మికుల బతుకులతో చెలగాటమాడాటారని, ఆయన హయాంలోనే బీడీ కట్టలపై పుర్రె గుర్తు ముద్రించారని విమర్శించారు.