నెల్లూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బెంగళూరులో జగన్‌కు శ్వేతసౌధం: మంత్రి ఆనం సెటైర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Anam Ramanarayana Reddy
నెల్లూరు: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఓ పెద్ద దోపిడిదారుడు అని ఆర్థిక శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆదివారం ఆరోపించారు. బెంగళూరులోని అత్యాధునిక వసతులున్న డెబ్బై గదులు ఉన్న రాజభవనాన్ని ఎలా నిర్మించాడో చెప్పాలని డిమాండ్ చేశారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నగర కాంగ్రెసు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆరోపించినట్లుగా తాము ఎక్కడా అధికార దుర్వినియోగానికి పాల్పడలేదని అన్నారు.

జగన్‌కు తమ పార్టీని, పార్టీ నేతలను విమర్శించే నైతిక హక్కు లేదన్నారు. జగన్ విమర్శలను ఆయన తప్పు పట్టారు. లక్ష కోట్లు సంపాదించిన జగన్ బెంగళూరులో శ్వేత సౌధాన్ని నిర్మించారని ఎద్దేవా చేశారు. నెల్లూరు జిల్లాకు మొదటిసారిగా నాటు బాంబుల సంస్కృతి తీసుకు వచ్చింది తాజా మాజీ పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డిని, ఊసరవెల్లిలా పార్టీలు మారుస్తున్న నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని పక్కన పెట్టుకొని జగన్ నీతులు చెప్పడం విడ్డూరం, సిగ్గుచేటు అన్నారు. కొవూరులో కాంగ్రెసు ఘన విజయం సాధించడం ఖాయమన్నారు.

English summary
Minister Anam Ramanarayana Reddy accused that YSR Congress Party chief YS Jaganmohan Reddy built white house at Bangalore.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X