మగాడివైతే రా!: రాజీనామాపై బాబుకు కెసిఆర్ సవాల్
మన తెలంగాణలో నీళ్లు, బొగ్గు ఉంటే సీమాంధ్రులు లబ్ధి పొందుతున్నారన్నారు. తెలంగాణ వచ్చే సమయం ఆసన్నమైందన్నారు. తెలంగాణను అడ్డుకున్నదే చంద్రబాబు అన్నారు. సీమాంధ్ర నేతల రాజీనామా పత్రాలు తయారయిందే చంద్రబాబు చాంబరులో అన్నారు. చిరంజీవి, చంద్రబాబు, కిరణ్ అందరూ ఒక్కటై వచ్చిన తెలంగాణ అడ్డుకున్నారన్నారు. రాజీనామా డ్రామాలతో తెలంగాణ వెనక్కి పోయిందన్నారు. చంద్రబాబుది పక్కా ఆంధ్రా పార్టీ అన్నారు. మిగతా పార్టీల్లో తెలంగాణ వారు పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందని, కానీ టిడిపిలో మాత్రం ఆ అవకాశం లేదన్నారు. కాంగ్రెసు ఆంధ్రా నాయకుల చెప్పు చేతల్లో ఉండే పార్టీ అన్నారు. టిడిపి, కాంగ్రెసులను వంద మీటర్ల లోతున పాతి పెట్టాలన్నారు. తెలంగాణకు బాబు శకుని అయితే కిరణ్ శని అన్నారు. కాంగ్రెసుకు ఐదు రాష్ట్రాల్లో దిమ్మదిరిగే ఫలితాలు వచ్చాయన్నారు.
తెలంగాణ ప్రజల్లో జాగృతం వచ్చిందన్నారు. మనకు రావాల్సిన నీటి వాటా, ఉద్యోగాల గురించి నాకు ఉండే బాధ చంద్రబాబు, కిరణ్కు ఉంటుందా అన్నారు. ఇది వ్యక్తుల మధ్య జరుగుతున్న ఎన్నికలు కావన్నారు. తెలంగాణ వస్తే పిల్లలకు ఉచిత నిర్బంధ విద్య ప్రవేశ పెడతామన్నారు. నా ఒక్కడి వల్లే తెలంగాణ రాదని ఆయన అన్నారు. అందరం కలిస్తేనే తెలంగాణ సాధిస్తామని అన్నారు. వోట్ల కోసం లిక్కర్లు పంచుతున్న నీచుడు చంద్రబాబు అన్నారు. ఈ సభతో జూపల్లి కృష్ణా రావును గెలిపిస్తారనే నమ్మకం నాకు ఏర్పడిందన్నారు. అందరూ కారు గుర్తుకు ఓటు వేయడమే కాకుండా కాంగ్రెసు, టిడిపిలకు డిపాజిట్ దక్కకుండా చేయాలన్నారు.