హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

శోభానాగిరెడ్డిపై గంగుల, పిల్లిసుభాష్‌పై తోట త్రిమూర్తులు!

By Srinivas
|
Google Oneindia TeluguNews

Congress Log
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం శాసనసభ్యులపై అనర్హత వేటు పడిన వారి స్థానాలలో నాలుగింటిలో కాంగ్రెసు పార్టీ సోమవారం పార్టీ ఇంచార్జులను ఖరారు చేసింది. అనర్హత వేటు పడిన స్థానాల్లో అభ్యర్థులపై కాంగ్రెసు తన కసరత్తు కొనసాగిస్తోంది. ప్రస్తుతానికి నాలుగు నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఇంచార్జులుగా ప్రకటించింది. రామచంద్రాపురంలో తోట త్రిమూర్తులు, ఆళ్లగడ్డలో గంగుల ప్రతాప్ రెడ్డి, నర్సన్నపేటలో ధర్మాన రాందాస్, నర్సాపురంలో కొత్తపల్లి సుబ్బారాయుడు పేర్లను ఖరారు చేసింది.

ఆళ్లగడ్డ నుండి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తరఫున రాజీనామా చేసిన శోభా నాగి రెడ్డియే పోటీ చేయనున్నారు. దీంతో గంగుల ప్రతాప్ రెడ్డి ఈమెను ఎదుర్కోవాల్సి ఉంది. గత ఎన్నికల్లో ఈయన స్వల్ప మెజార్టీతో ఓటమి పాలయ్యారు. ఇక రామచంద్రాపురం నుండి పిల్లి సుభాష్ చంద్రబోసుతో తోట త్రిమూర్తులు తలపడనున్నారు. అయితే తోట త్రిమూర్తులు పిల్లికి ధీటైన అభ్యర్థి కాదని అంటున్నారు. కానీ స్థానికంగా సుభాష్ చంద్రబోసుకు ఉన్న వ్యతిరేకత లబ్ధి చేకూరుస్తుందని అంటున్నారు.

English summary
Congress Party announced four candidates for by polls today. Gangula Pratap Reddy from Allagadda, Tota Trimurthulu from Ramachandrapuram will contest.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X