నెల్లూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆ ఆలోచన లేదు: మళ్లీ తేల్చి చెప్పిన నాగార్జున

By Srinivas
|
Google Oneindia TeluguNews

Nagarjuna
నెల్లూరు: రాజకీయ ఆరంగేట్రంపై ప్రముఖ సినీ హీరో నాగార్జున మరోసారి పెదవి విప్పారు. ఆయన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో కల్యాణ్ జువెల్లర్స్ నగల దుకాణం ప్రారంభోత్సవానికి బుధవారం విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయనను మీడియా పలకరించింది. తనకు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఏమీ లేదని ఆయన మరోసారి స్పష్టం చేశారు. తన తండ్రి నాగేశ్వర రావు, నాగచైతన్యతో కలిసి ఓ సినిమా చేయాలన్న ఆలోచన ఉందని చెప్పారు. దీనికి సంబంధించి కథపై చర్చలు జరుగుతున్నాయని అన్నారు. తన రెండో తనయుడు అఖిల్ సినిమాలలోకి రావడానికి ఇంకా చాలా సమయం ఉందని చెప్పారు. అఖిల్ పెద్దయ్యాక అతనితో కలిసి నటిస్తానని చెప్పారు. షిర్డీ సాయి బాబా కంటే ఢమరుకం చిత్రం ముందు విడుదల అవుతుందని ఆయన చెప్పారు.

కాగా ఇటీవల నాగార్జున రాజకీయ రంగ ప్రవేశంపై జోరుగా చర్చ జరిగిన విషయం తెలిసిందే. ఆయన గతంలో చిత్తూరు జిల్లాలోని తిరుపతిలో కల్యాణ్ జువెల్లర్స్ ప్రారంభోత్సవానికి వెళ్లినప్పుడు ఆయనను విలేకరులు రాజకీయ ఆరంగేట్రంపై ప్రశ్నించారు. అందుకు నాగార్జున... తనకు రాజకీయాలు అంటే ఇష్టమని, ఎప్పటికి అప్పుడు ఫాలో అవుతుంటానని అయితే రాజకీయాలు తనకు సూట్ కావేమోనని ఆయన అన్నారు. దీంతో ఆయన రాజకీయాల్లోకి వచ్చే అవకాశముందని జోరుగా చర్చకు తెరలేసింది. అయితే ఆ తర్వాత ఆయన తాను రాజకీయాల్లోకి రానని పలుమార్లు స్పష్టం చేశారు.

English summary
Hero Nagarjuna said today in SPS Nellore district that he will not enter in to politics.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X