ఎపికి మళ్లీ రైల్వే మంత్రి టోపీ, కిక్కురుమనని ఎంపీలు
కాగా రైల్వే బడ్జెట్లో రాష్ట్రానికి నష్టం జరుగితే ఊరుకునేది లేదని హెచ్చరించిన మన పార్లమెంటు సభ్యులు మంత్రి ప్రసంగం సాగుతున్నంత సేపు నోరెత్తక పోవడం విశేషం. కాగా బడ్జెట్లో రాష్ట్రానికి మొండిచేయి చూపడంపై ప్రయాణీకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పదేళ్ల తర్వాత చార్జీలు స్వల్పంగా పెరిగాయి. కాగా రైల్వే బడ్జెట్లో రాష్ట్రానికి మొండిచేయి చూపారాని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ విమర్శించారు. బెంగాల్, కేరళ, తమిళనాడులకు అత్యధిక వరాలు కురిపించారన్నారు. రాష్ట్రాన్ని విస్మరించారన్నారు. చార్జీలు పెంచడం వల్ల పేదలపై భారం పడుతుందని అన్నారు.
రైలు ఎక్కడం కంటే దాని కింద పడటం మేలని ప్రయాణీకులు భావిస్తున్నారని తెలుగుదేశం పార్టీ నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు విమర్శించారు. రాష్ట్రానికి న్యాయం జరగలేదన్నారు. టిడిపి ఎంపీ నామా నాగేశ్వర రావు ఢిల్లీలో మాట్లాడుతూ.. బడ్జెట్లో రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందన్నారు. రైల్వేలో సంస్కరణలు తీసుకు రావాలన్నారు.