వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రత్యేక జోన్ కోసం హోర్డింగ్ ఎక్కాడు, నచ్చజెప్పిన మంత్రి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Vishakapatnam
విశాఖపట్నం: విశాఖకు ప్రత్యేక జోన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ జై ఉత్తరాంధ్ర రక్షణ వేదిక సభ్యుడు ఒకరు హోర్డింగ్ ఎక్కి హల్ చల్ సృష్టించారు. బుధవారం రైల్వే శాఖ మంత్రి త్రివేది బడ్జెట్‌లో విశాఖకు ప్రాధాన్యత ఇవ్వలేదని, విశాఖకు ప్రత్యేక రైల్వే జోన్‌గా ఏర్పాటు చేసే విషయంలో హామీ ఇవ్వలేదని రామారావు అనే వ్యక్తి హోర్డింగ్ ఎక్కాడు. విశాఖను ప్రత్యేక జోన్‌గా పరిగణించే వరకు తాను దిగేది లేదని హెచ్చరించారు. హామీ ఇవ్వకుంటే తాను కిందకు దూకేస్తానని హెచ్చరించారు. దీంతో అక్కడకు పోలీసులు, అధికారులు చేరుకున్నారు.

రామారావును కిందకు దింపేందుకు ప్రయత్నాలు చేశారు. కానీ అతను ససేమీరా అన్నాడు. విశాఖ నుండి ఓ కేంద్రమంత్రి ఉన్నప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందని అన్నాడు. అక్కడ భారీగా ప్రజలు గుమికూడారు. చివరకు మంత్రి గంటా శ్రీనివాస రావు రంగంలోకి రామారావుకు నచ్చజెప్పటంతో హోర్డింగ్ దిగాడు. దీంతో పోలీసులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన నగరంలోని ఎల్ఐసి బిల్డింగ్ సమీపంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద జరిగింది.

English summary
A Jai Uttarandhra Rakshana member climbed hording for Vishaka special zone.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X