కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టివి చూడనివ్వలేదని అక్క ఘాతుకం, తమ్ముడు హతం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Karimnagar Map
కరీంనగర్: టివి చూసే విషయంలో జరిగిన గొడవ కాస్త ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్న సంఘటన కరీంనగర్ జిల్లాలోని కమలాపురంలో చోటు చేసుకుంది. కమలాపురంకు చెందిన ఇరవయ్యేళ్ల అక్క రేణుక, పదిహేడేళ్ల తమ్ముడు నాగరాజు మధ్య టివి ఎవరు చూడాలనే విషయమై గొడవ జరిగింది. మంగళవారం ఇంట్లో ఉన్న నాగరాజు, రేణుకలు టివి చూస్తున్న సమయంలో గొడవ పడ్డారు. తానే టివి చూస్తానని తమ్ముడు తేల్చి చెప్పడంతో కోపం పట్టలేని రేణుక పదునైన ఆయుధంతో అతనిపై దాడి చేసి గాయపర్చింది.

నాగరాజు సంఘటన స్థలంలోనే మృతి చెందగా శవంపై కిరోసిన్ పోసి నిప్పంటించింది. సగం కాలిన మృతదేహాన్ని ఇంటి గోడ పక్కన దాచి పైన పాత దుప్పట్లు, పనికి రాని సామాగ్రి వేసింది. రాత్రి ఇంటికి వచ్చిన తల్లి కుమారుడి కోసం ఆరా తీసి బుధవారం ఉదయం వెతకడంతో ఈ విషయం వెలుగు చూసింది. కాగా రేణుక, నాగరాజుల తండ్రి ఉపాధి కోసం గల్ఫ్‌లో ఉండగా, తల్లి కోమలి చిరు వ్యాపారం చేస్తున్నారు.

English summary
A sister was killed her brother in Karimnagar district on tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X