నెల్లూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తండ్రిని తిట్టిన వారికి జగన్ మద్దతు ఇస్తున్నాడు: విహెచ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

V Hanumantha Rao
నెల్లూరు: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డిని తిట్టని తిట్టు తిట్టిన నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి ఓటు వేయమని ప్రజలను అడగడమేమిటని కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత వి హనుమంత రావు గురువారం అన్నారు. విహెచ్ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కొవూరు నియోజకవర్గంలో కాంగ్రెసు పార్టీ అభ్యర్థి పొలంరెడ్డి శ్రీనివాస రెడ్డి తరఫున ప్రచారం నిర్వహించేందుకు వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గత 2009 సాధారణ ఎన్నికల్లో ప్రస్తుత జగన్ పార్టీ అభ్యర్థి వైయస్‌ను బాగా తిట్టారన్నారు. ఇప్పుడు అతనికే జగన్ ఓటేయమనడం శోచనీయం అన్నారు.

వైయస్ బతికి ఉంటే జైలుకు వెళ్లే వారని విమర్శించారు. జగన్ అవినీతి, అక్రమాలను వదిలే ప్రసక్తి లేదన్నారు. ఈ ఎన్నికలు ప్రభుత్వానికి రిఫరెండం కాదన్నారు. జగన్ విశ్వసనీయత, విలువల గురించి మాట్లాడటం విడ్డూరమన్నారు. తమ పార్టీ అభ్యర్థి పొలంరెడ్డి మంచి వ్యక్తి అని, ఆయన గెలిచే అవకాశముందన్నారు. ప్రజలు అవినీతిని దూరంగా పెట్టి కాంగ్రెసుకు ఓటేయాలని సూచించారు. తెలంగాణ ఉద్యమం దశాబ్దాలుగా ఉన్నదని చెప్పారు. 2009లోనే చిదంబరం తెలంగాణకు అనుకూలంగా ప్రకటన చేశారన్నారు. కాంగ్రెసు తెలంగాణకు ఇస్తుందన్నారు.

English summary
Congress Party senior leader V Hanumantha Rao questioned that why Jaganmohan Reddy is supporting Nallapureddy Prasanna Kumar Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X