వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పార్టీ క్రమశిక్షణకు ఎవరూ అతీతులు కారు: దీదీ

By Pratap
|
Google Oneindia TeluguNews

Mamata Banerjee
కోల్‌కతా: పార్టీ క్రమశిక్షణకు ఎవరూ అతీతులు కారని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెసు అధ్యక్షురాలు మమతా బెనర్జీ రైల్వే మంత్రి దినేష్ త్రివేది వ్యవహారంపై అన్నారు. రైల్వే చార్జీల పెంపుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ దినేష్ త్రివేదీని మంత్రి పదవి నుంచి తొలగించి ఆ స్థానంలో ముకుల్ రాయ్‌ని నియమించాలని ఆమె ప్రధాని మన్మోహన్ సింగ్‌ను కోరిన విషయం తెలిసిందే.

చార్జీల పెంపు విషయంలో దినేష్ త్రివేదీ తనను గానీ, పార్టీ ప్రధాన కార్యదర్శి ముకుల్ రాయ్‌ని గానీ సంప్రదించలేదని ఆమె అన్నారు. పశ్చిమ బెంగాల్ శానససభ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో జరిగిన పార్టీ శానససభా పక్ష సమావేశంలో ఆమె ఆ విధంగా అన్నారు. రైల్వే చార్జీల పెంపు వల్ల ప్రజలపై భారం పడుతుందని ఆమె అన్నారు. రైల్వే చార్జీల పెంపును తమ పార్టీ వ్యతిరేకిస్తుందని ఆమె స్పష్టం చేశారు. మమత వైఖరిని పార్టీ సమర్థిస్తూ త్రివేదీని విమర్శించింది.

English summary
Trinamool Congress chief Mamata Banerjee, who has demanded that Prime Minister replace railway minister Dinesh Trivedi with her trusted lieutenant Mukul Roy, has said no one was above party discipline.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X