హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కెసిఆర్‌కు సరదా, జగన్ రాత్రికి రాత్రే కలిపేస్తాడు: బాబు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావుపై తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం మండిపడ్డారు. కెసిఆర్‌కు ఎన్నికలు అంటే సరదా అని ఆరోపించారు. ఆయనకు ఓటు, నోటు, సీటు తప్ప ఏదీ పట్టదన్నారు. అదే ఆయన లక్ష్యమన్నారు. సూటుకేసుల కోసమే కెసిఆర్ పార్టీ పెట్టి తరుచూ ఎన్నికలకు వెళ్తున్నారన్నారు. ఆయన వద్దకు సూటుకు కేసులు తెస్తే పూల వర్షం లేదంటే రాళ్ల వర్షం కురిపిస్తారని ధ్వజమెత్తారు. వైయస్ జగన్ అవినీతితో సంపాదించారని ఆరోపించారు. ఆయనపై ఉన్న కేసులు అన్నింటినీ ఎత్తి వేస్తానని కాంగ్రెసు పార్టీ అధిష్టానం హామీ ఇస్తే జగన్ రాత్రికి రాత్రే తన పార్టీని కాంగ్రెసులో కలిపేస్తాడన్నారు.

ప్రణబ్ ముఖర్జీ బడ్జెట్ పైన ఆయన మండిపడ్డారు. ఇది ప్రజల వ్యతిరేక బడ్జెట్ అన్నారు. ఎరువుల ధరలు విపరీతంగా పెంచుతున్నారని విమర్శించారు. సామాన్యులను దోచేలా బడ్జెట్ ఉందన్నారు. రాయితీలు తగ్గించి పన్నులు పెంచారని విమర్శించారు. వ్యవసాయం ఇబ్బందుల్లో ఉన్న ఈ సమయంలో రైతులకు ఎలాంటి హామీ లేదన్నారు. ప్రణబ్ సబ్సిడీలు తగ్గించడం బాధాకరమని టిడిపి నేత యనమల రామకృష్ణుడు వేరుగా అన్నారు. వ్యవసాయ సంస్కరణల గురించి బడ్జెట్‌లో చోటు ఏదన్నారు. ఇది పేదల బడ్జెట్ కాదని పెద్దల బడ్జెట్ అన్నారు. భద్రత గురించి కేంద్రం ఇప్పుడు మాట్లాడటం శోచనీయమన్నారు. పేద, ధనిక వర్గాల మధ్య వ్యత్యాసం తగ్గించేలా లేదన్నారు.

English summary
TDP chief Nara Chandrababu Naidu blamed TRS chief K Chandrasekhar Rao and YSR Congress Party chief YS Jaganmohan Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X