ఉప ఎన్నికల పోలింగ్కు ఏర్పాట్లు పూర్తి, భారీ భద్రత
మహబూబ్నగర్ జిల్లా కొల్లాపూర్లో మూడు ప్రధాన పార్టీలు రంగంలో ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో లక్షా 95 వేల పైచిలుకు ఓటర్లున్నారు. నియోజకవర్గంలోని 45 గ్రామాలను అతి సమస్యాత్మక గ్రామాలుగా గుర్తించి భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆదిలాబాద్ నియోజకవర్గంలో లక్షా 72 వేల మంది పైచిలుకు ఓటర్లున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు, ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు పోటీలో ఉన్నారు. స్థానికంగా వీడియో గ్రాఫర్లు అందుబాటులో లేకపోవడంతో పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్ర నుంచి వీడియో గ్రాఫర్లను పిలిపించేందుకు అధికారులు తంటాలు పడుతున్నారు.
వరంగల్ జిల్లా స్టేషన్ ఘనపూర్లో నాలుగు ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు ఐదుగురు అభ్యర్థులు పోటీలో ఉన్నారు. పోలింగుకు జిల్లా అధికార యంత్రాంగం పూర్తి ఏర్పాట్లు చేసింది. పోలింగ్కు ముందు నాగర్ కర్నూలులో హైడ్రామా చోటు చేసుకుంది. తెరాస మద్దతుతో ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్న నాగం జనార్దన్ రెడ్డి ఇంటికి వెళ్లి పోలీసులు హంగామా సృష్టించారు. మహబూబ్నగర్ నియోజకవర్గంలో కూడా పోలింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కామారెడ్డిలో కూడా పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది తరలి వెళ్లారు. అన్ని నియోజకవర్గాల్లో ప్రతి పోలింగ్ కేంద్రంలోనూ వీడియోలతో ఓటంగు ప్రక్రియను రికార్డు చేయనున్నారు.