ప్రజలు నవ్వుతారు, చిరుకు హామీ నెరవేర్చాం: విహెచ్
కార్పొరేట్, రియల్ ఎస్టేట్ కంపెనీలకు భూములు కట్టబెట్టే సంస్థగా విశాఖ పట్టణాభివృద్ధి సంస్థ మారిందని విమర్శించారు. నిందితుల నుంచి ఆ మొత్తాన్ని రికవరీ చేసి పేదలకు ఇళ్లు కట్టించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. విశాఖలో స్థలాలు పొందిన ఐటీ సంస్థలు విప్రో, సత్యంలు ఇంత వరకూ కార్యకలాపాలను ప్రారంభించనందున ఆ స్థలాలను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పార్టీని నమ్ముకొని, కష్టపడి పని చేసే నిజమైన కార్యకర్తలకు కాంగ్రెసు పార్టీ తప్పనిసరిగా ప్రాధాన్యం ఇస్తుందని మరోసారి నిరూపితమైందన్నారు. సోనియా గాంధీ పార్టీ కోసం పని చేసే వారు ఎక్కడున్నా గుర్తించి పదవుల్లో అవకాశం కల్పిస్తున్నారని అన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ చిరంజీవికి రాజ్యసభ అవకాశం కల్పించారని చెప్పారు. వాగ్ధాటి కలిగిన మహిళా నాయకురాలు రేణుకా చౌదరికి అవకాశం కల్పించడం పార్టీకి రాజ్యసభలో, వెలుపల కూడా ఎంతో ఉపయోగం ఉంటుందన్నారు.