ఎమ్మార్ కేసు: సిబిఐకి సుధీర్ రెడ్డి వాంగ్మూలం

EMAAR Properties
హైదరాబాద్: ఎమ్మార్ విల్లాల కొనుగోలుపై గతంలో మౌనం వహించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి చివరకు సీబీఐ ముందు వాంగ్మూలం ఇచ్చారు. సుధీర్‌రెడ్డి తన భార్య కమలారెడ్డి పేరుతో ఎమ్మార్‌లో విల్లా కొనుగోలు చేశారు. 1122 గజాల విస్తీర్ణంలో ఉన్న ఈ విల్లా కోసం ఆయన 2.5 కోట్లు చెల్లించారు. దీనిపై సెప్టెంబర్ 16న కమలారెడ్డిని సీబీఐ విచారించింది. ఆ సమయంలో ఆమె ఎదుటే ఉన్న సుధీర్ రెడ్డి ఈ విషయాలేవీ వెల్లడించలేదు.

తర్వాత ఆధారాలు లభించడంతో సీబీఐ ఆయనను విచారణకు పిలిపించింది. సోమవారం సీబీఐ కార్యాలయానికి వచ్చిన ఆయన విల్లా కొనుగోలు వివరాలను అధికారులకు తెలిపారు. తన సోదరుడు రణధీర్ రెడ్డి ద్వారా తుమ్మల రంగారావు అకౌంటెంట్ శ్రీనివాసరావుకు ఈ మొత్తాన్ని నగదు రూపంలో చెల్లించినట్లుగా సుధీర్‌రెడ్డి అంగీకరించారని సమాచారం. ఆయన్ను సాక్షిగా పరిగణించిన దర్యాప్తు అధికారులు వాంగ్మూలాన్ని నమోదు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+