గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బాబుపై జగన్ విమర్శల దూకుడు: తొలిసారి అవినీతిపై

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
గుంటూరు: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ విరుచుకుపడ్డారు. తొలిసారి అవినీతి గురించి ఆయన మాట్లాడారు. తాను ముఖ్యమంత్రినైతే రాష్ట్రం లో అవినీతికి తావులేకుండా చేస్తానని అన్నారు. బుధవారం రాత్రి గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా కోవూరు ఫలితాలే పునరావృతమవుతాయని అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో 42 స్థానాలకుగాను 35 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచి తీరుతుందని చెప్పారు. తద్వారా కేంద్రంలో కూడా పట్టు సాధిస్తామని, దేవుడు కరుణిస్తే కేంద్ర వ్యవసాయ, రైల్వే మంత్రిత్వ శాఖలు పొంది రాష్ట్రానికి న్యాయం చేస్తామన్నారు.

కోవూరు ప్రజలు అవినీతికి పట్టం కట్టారని చంద్రబాబు వ్యాఖ్యానించడంపై జగన్ నిప్పులు చెరిగారు. బాబు హయాంలో రాష్ట్రంలో అవినీతి పెచ్చుపెరిగిందని ధ్వజమెత్తారు. మద్యాన్ని ఏరులుగా పారించి పల్లెలకు కూడా విస్తరింపజేసిన ఘనత చంద్రబాబుదేనని, రైతులకు చంద్రబాబు చేసిందేమీ లేదని దుయ్యబట్టారు. కోర్టులను, సీబీఐని చంద్రబాబు మోసం చేస్తున్నారని విమర్శించారు. ఢిల్లీకి వెళ్లి చీకట్లో చిదంబరం కాళ్లు పట్టుకొని సీబీఐ కేసులను తప్పించుకున్న ఘనత చంద్రబాబుదేనని, తనకు ఆ ఖర్మ పట్టలేదని, దేవుడిని నమ్ముకొని ఉన్నానని అన్నారు. రెండెకరాల చంద్రబాబు ఆస్తులు ఎలా సంపాదించారని ఆయన అడిగారు. వైయస్ ప్రభుత్వ హయాంలో తాను ఐఎఎస్ అధికారికి ఒక్కరికైనా ఫోన్ చేసినట్లు చంద్రబాబు నిరూపించగలరా అని ఆయన అడిగారు.

ప్రజల అండదండలు ఉన్నంతకాలం తనను ఎవరూ ఏమీ చేయలేరన్నారు. రాష్ట్రంలో మూడో పార్టీ అధికారంలోకి రాకుండా టీడీపీ, కాంగ్రెస్‌లు వ్యవహరిస్తున్నాయని.. తమలో ఏ ఒక్కరో మాత్రమే అధికారంలోకి రావడం కోసం మూడో పార్టీని తొక్కేస్తున్నాయని ఆరోపించారు.

English summary
YSR Congress president YS Jagan lashed out at TDP president N Chandrababu Naidu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X