వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కిరణ్ వెళ్లారు, బొత్స వచ్చారు!:కార్యక్రమాలకు దూరంగా
మంత్రులు ధర్మాన ప్రసాద రావు, వట్టి వసంత్ కుమార్, బాలరాజు, కొండ్రు మురళితో కలిసి సిఎం హైదరాబాదు బయలుదేరిన ఐదు నిమిషాలకు బొత్స విశాఖ విమానాశ్రయానికి వచ్చి మరో విమానంలో హైదరాబాద్ వెళ్లారు. పర్యాటక అభివృద్ధిపై ఓ హోటల్లో జరిగిన కార్యక్రమానికి తనకు ఆహ్వానం అందలేదని మంత్రి బాలరాజు అదే హోటల్లో వేరే గదిలో చాలాసేపు గడిపారు. తర్వాత ఎమ్మెల్సీని పంపించి ఆయనను బుజ్జగించారు. ఇదే సమావేశంలో మంత్రి వట్టి ఓ సమయంలో కలెక్టర్పై అసహనం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. బీచ్లో జరిగిన సమావేశంలో మంత్రి వట్టి కమిషనర్ను మైకులోనే మందలించారు.
Comments
kiran kumar reddy botsa satyanarayana vatti vasanth kumar vishakapatnam కిరణ్ కుమార్ రెడ్డి బొత్స సత్యనారాయణ వట్టి వసంత్ కుమార్ విశాఖపట్నం
English summary
It seems, the differences in Congress party revealed again in CM Kiran Kumar Reddy Vishaka tour.
Story first published: Monday, March 26, 2012, 10:25 [IST]