హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బిపి ఆచార్యకు షాక్, బెయిల్‌ను రద్దు చేసిన హైకోర్టు

By Pratap
|
Google Oneindia TeluguNews

BP Acharya
హైదరాబాద్: ఎమ్మార్ ప్రాపర్టీస్ కుంభకోణం కేసులో ఐఎఎస్ అధికారి బిపి ఆచార్యకు హైకోర్టు షాక్ ఇచ్చింది. సిబిఐ ప్రత్యేక కోర్టు బిపి ఆచార్యకు మంజూరు చేసిన బెయిల్‌ను హైకోర్టు మంగళవారం రద్దు చేసింది. తక్షణమే లొంగిపోవాలని హైకోర్టు బిపి ఆచార్యను ఆదేశించింది. ఎమ్మార్ ప్రాపర్టీస్ కుంభకోణం కేసులో సిబిఐ కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో బిపి ఆచార్య విడుదలయ్యారు.

అయితే, ప్రత్యేక కోర్టు ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ సిబిఐ హైకోర్టుకు వెళ్లింది. సిబిఐవాదనలు వినకుండా నాంపల్లి ప్రత్యేక కోర్టు ఆచార్యకు బెయిల్ ఇవ్వడంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. కేసు విచారణ జరుగుతుండగా ఆచార్యకు బెయిల్ ఇవ్వడం సరి కాదని అభిప్రాయపడింది.

ఎమ్మార్ కుంభకోణం కేసులో అరెస్టయిన సునీల్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై విచారణను హైకోర్టు ఏప్రిల్ 2వ తేదీకి వాయిదా వేసింది. ఈ కేసులో హైకోర్టు సిబిఐకి నోటీసులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని సిబిఐని ఆదేశించింది. మరోవైపు ఇదే కేసులో కోనేరు ప్రసాద్ బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది.

English summary
High Court has cancelled BP Acharya's bail in EMAAR case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X