ఈపరిస్థితుల్లో తెలంగాణపై తీర్మానం చేయలేం: జానారెడ్డి
ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణతో పార్టీ పటిష్టతపై చర్చించానని అన్నారు. తాము ఢిల్లీ వెళ్లేది తెలంగాణ కోసం అధిష్టానంపై ఒత్తిడి తెచ్చేందుకేనని చెప్పారు. ఈ నెలాఖరున సీనియర్ నేతలం అందరం ఢిల్లీ వెళ్లనున్నట్లు చెప్పారు. తాము తెలంగాణ అంశంపై పార్టీ అధిష్టానాన్ని అడుగుతామన్నారు. ఈసారి తాము కార్యసాధకులమై రావాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారన్నారు. తెలంగాణ కోసం తాము గట్టిగా ప్రయత్నిస్తున్నామని చెప్పారు. తెలంగాణ సాధనే తమ లక్ష్యమని జానా రెడ్డి చెప్పారు.
కాగా జానా రెడ్డిని పలువురు సీనియర్ నేతలు ఆయన ఛాంబర్లో ఉదయం కలిశారు. దీంతో ఆయన ఛాంబర్ వద్ద హడావుడి కనిపించింది. మాజీ మంత్రులు జెసి దివాకర్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డిలు ఆయనను కలిశారు. ఢిల్లీకి వెళ్లే అంశం, పార్టీ తాజా పరిస్థితులపై వారు చర్చించుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణతోనూ జానా భేటీ అయి రాజకీయ పరిస్థితులపై చర్చించారు.