జెసి రాయలతెలంగాణ ప్రతిపాదనకు ఒప్పుకోం: కెటిఆర్
తెలంగాణలో జరుగుతున్న ఆత్మహత్యలపై అప్పీలు చేసే బాధ్యత తమకు లేదా అని వారు ప్రశ్నించారు. ఇది సీమాంధ్ర సభలా కనిపిస్తోందన్నారు. ఆత్మహత్యలపై స్పందించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా అని అడిగారు. ఆత్మబలిదానాలు జరుగుతుంటే సీమాంధ్ర నేతలకు మానవత్వం లేదా అని విమర్శించారు. బలిదానాలపై సభలో చర్చ జరగాలన్నారు. తెలంగాణపై అసెంబ్లీలో తీర్మానం పెట్టాల్సిందేనని చెప్పారు. సీమాంధ్రుల అడుగులకు మడుగులొత్తే విధానం తెలంగాణ ప్రాంత నేతలు మానుకోవాలని సూచించారు. ఆత్మహత్యలపై సంతాపం తెలుపుతున్న సమయంలో స్పీకర్ తెలంగాణ పదం రాకుండా జాగ్రత్త పడ్డారని విమర్శించారు.
తెలంగాణ ప్రాంతంలో జరుగుతున్న ఆత్మహత్యలకు ప్రభుత్వమే కారణమన్నారు. టిడిపి, కాంగ్రెసు నేతలు ఇంకా పదవులలో ఎందుకు ఉండాలో ఆలోచించుకోవాలని అన్నారు. ప్రజాక్షేత్రంలో తెలంగాణ ద్రోహులకు శిక్ష తప్పదన్నారు. ఆ రెండు పార్టీల కుట్రలు బయటపడతాయనే సభలో చర్చ జరగకుండా వాయిదాలు వేస్తున్నారన్నారు. తెలంగాణ కోసం యువత ఆత్మహత్య చేసుకోవద్దని సూచించారు. పోరాడి సాధించుకుందామన్నారు. తెలంగాణపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వెలికిగా మాట్లాడుతున్నారని విమర్శించారు. తీర్మానం చేసే వరకు సభను నడవనిచ్చేది లేదన్నారు. రాష్ట్రం రావణ కాష్టంలా మారడానికి కేంద్ర ప్రభుత్వమే కారణమని సిపిఎం ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు.