హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కిడ్నాపైన తెలుగు యువత నాయకుడి దారుణ హత్య

By Srinivas
|
Google Oneindia TeluguNews

Charminar
హైదరాబాద్: మూడు రోజుల క్రితం కిడ్నాప్‌కు గురైన తెలుగుదేశం పార్టీ అనుబంధ తెలుగు యువత నేత దారుణ హత్యకు గురయినట్లుగా తెలుస్తోంది. శేరిలింగంపల్లి నియోజకవర్గానికి చెందిన తెలుగు యువత నాయకుడు చంద్రశేఖర రెడ్డిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా చంపారు. భూవివాదం, పాత కక్షలే ఇందుకు కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆదివారం సాయంత్రం చంద్రశేఖర రెడ్డి కిడ్నాప్‌కు గురయ్యాడు. ఇతను నిజాంపేట్ రోడ్డులోని జయభారత్ నగర్‌లోని ఒక అపార్టుమెంట్‌లో ఉంటున్నారు. ఈ నెల 25వ తారీఖు ఆదివారం నాడు తన కూతురును కాలేజ్ వద్ద దించిన అనంతరం తన భార్యకు ఫోన్ చేసి మిత్రుడి వద్దకు వెళ్లి వస్తానని చెప్పారు. అప్పటి నుండి అతను తిరిగి రాలేదు. రాత్రి వరకు చూసిన కుటుంబ సభ్యులు ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అదే రోజు రాత్రి చంద్రశేఖర రెడ్డి కారు ఎస్సార్ నగర్‌లోని ఓ రెస్టారెంట్ వద్ద చంద్రశేఖర రెడ్డి, మరో మిత్రుడు కారును వెనక్కి తీస్తుండగా వాచ్‌మెన్‌కు గాయాలయ్యాయి. దీనిపై పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. దీంతో వారు కారును అక్కడే వదిలిపెట్టి వెళ్లారు. పోలీసులు కారును స్వాధీనం చేసుకున్నారు. సోమవారం చంద్రశేఖర రెడ్డి భార్య సుజాత ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి కారు చూశారు. కారున్నా భర్త లేకపోవడంపై ఆరా తీశారు. కెపిహెచ్‌బి పిఎస్‌లో అదృశ్యమైనట్లు కేసు పెట్టినట్లు చెప్పారు. అయితే మంగళవారం రాత్రి చంద్రశేఖర రెడ్డి మృతదేహం గోనె సంచిలో లభించింది. పోలీసులు విచారిస్తున్నారు. చంద్రశేఖర రెడ్డి సతీమణి సుజాత అనుమానితుల పేర్లు చెప్పారని సమాచారం.

English summary
Kidnapped TDP leader found as dead in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X