వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబు బాటలో!: ఆస్తులు ప్రకటించిన అఖిలేష్ యాదవ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Akhilesh Yadav
లక్నో: ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఆంధ్ర ప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బాటలో నడిచారు!. అయితే ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు ఇటీవల ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆస్తులు ప్రకటించగా, అఖిలేష్ ముఖ్యమంత్రి కాగానే తన ఆస్తులు ప్రకటించారు. ముఖ్యమంత్రి అయిన కొద్ది రోజుల్లోనే అఖిలేష్ తన ఆస్తులను బుధవారం ప్రకటించారు. ఆస్తులు ప్రకటించిన మొట్టమొదటి ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ కుమార్ యాదవ్ కావడం విశేషం. 38 ఏళ్ల అఖిలేష్ తన ఆస్తులను ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వ వెబ్‌సైట్‌లలో పెట్టారు.

తనకు మూడు సొంత ప్లాట్లు ఉన్నాయని పేర్కొన్నారు. రెండు లక్నోలో, ఒకటి ఇటావాలో ఉందని తెలిపారు. తనకు రూ.98 లక్షలు విలువ చేసే వ్యవసాయ భూమి ఉందని చెప్పారు. ఇన్వెస్ట్‌మెంట్ల రూపంలో రూ.1 కోటి, నగదు రూపంలో మరో రూ.కోటి పద్దెనిమిది లక్షలు ఉన్నట్లు తెలిపారు. రూ.1.3 కోట్ల లోన్ తన పేరు మీద ఉన్నట్టు చెప్పారు. రూ.20 లక్షల విలువైన పాజేరో ఉన్నట్లు అందులో తెలిపారు.

English summary
Akhilesh Yadav today became the first Uttar Pradesh Chief Minister to declare his assets publicly.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X