వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మార్కులు రాలేదని కూతురికి భిక్షాటన శిక్ష వేసిన తండ్రి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Karnataka Map
బెంగళూరు: పన్నెండు సంవత్సరాలు కూడా నిండని ఓ బాలికకు కన్న తండ్రే భిక్షాటన శిక్ష విధించిన ఘోర సంఘటన కర్నాటకలో చోటు చేసుకుంది. కర్నాటక రాష్ట్రంలోని మైసూరుకు చెందిన ప్రభు కూతురు ప్రియాంక. ఆమె స్థానిక ప్రైవేట్ పాఠశాలలో ఏడో తరగతి చదువుతోంది. ఇటీవల జరిగిన పరీక్షల్లో ఆమెకు తక్కువ మార్కులు వచ్చాయి. దీంతో ప్రియాంక తండ్రి ఆమెపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. అంతేకాదు ఆ కోపంలో కూతురికి భిక్షాటన శిక్ష విధించాడు. సమీపంలోని దేవస్థానం వద్ద భిక్షాటన చేయాలని చెప్పాడు. దీంతో ఆమె అక్కడ భిక్షాటన చేసింది.

స్కూల్ యూనిఫాంతో భిక్షాటన చేస్తున్న బాలికను గుర్తించిన స్థానికిలు శిశు సంక్షేమ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. బాగా చదువుకోకపోతే అడుక్కు తినాల్సి వస్తుందని తన కూతురికి చెప్పాలనే ఉద్దేశ్యంతోనే అలా చేశానని తండ్రి సమర్థించుకున్నాడు. పోలీసులు అతని అదుపులోకి తీసుకున్నారు.

English summary
A Father ordered his daughter to beg at temple for less marks in exams.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X