హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ ఆస్తుల కేసులో శ్రీలక్ష్మిని జైళ్లో ప్రశ్నిస్తున్న సిబిఐ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Srilaxmi
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో సిబిఐ అధికారులు శుక్రవారం ఓబుళాపురం మైనింగ్ కేసులో అరెస్టై చంచల్‌గూడ జైలులో ఉన్న ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మిని విచారిస్తున్నారు. ఆమెను జైలులోనే సిబిఐ విచారిస్తోంది. జగన్ ఆస్తుల కేసులో శ్రీలక్ష్మిని కూడా విచారించేందుకు అనుమతించాలన్న సిబిఐ విజ్ఞప్తికి ఇటీవల కోర్టు అనుమతించిన విషయం తెలిసిందే. ఓఎంసి కేసులో జైలులో ఉన్న శ్రీనివాస్ రెడ్డి స్వల్ప అస్వస్థతకు గురవడంతో జైలు అధికారులు అతనిని చికిత్స కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. జగన్ కేసులో అరెస్టైన జగతి పబ్లికేషన్ వైస్ చైర్మన్ విజయ సాయి రెడ్డి రిమాండ్‌ను సిబిఐ ప్రత్యేక కోర్టు శనివారం వరకు పొడిగించింది.

కాగా ఎమ్మార్ కేసులో తుమ్మల రంగారావు, కెవి రావు, శ్రీకాంత్ జోషిలకు సిబిఐ ప్రత్యేక కోర్టు బెయిల్ ఇచ్చింది. కెవి రావు, శ్రీకాంత్ జోషి రూ.25 వేల చొప్పున రెండేసి బాండ్లు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. తుమ్మల రంగారావుకు ఇదివరకే ముందస్తు బెయిల్ లభించిన విషయం తెలిసిందే. ఇదే కేసులో అరెస్టైన కోనేరు ప్రసాద్, సునీల్ రెడ్డి, విజయ రాఘవ, బిపి ఆచార్యలకు కోర్టు ఏప్రిల్ 13 వరకు రిమాండ్ పొడిగించింది.

English summary

 CBI is questioning IAS officer Srilaxmi in YSR Congress Party chief YS Jaganmohan Reddy assets case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X