హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్‌కు పుల్లా పద్మావతి ఝలక్, కాంగ్రెస్ గూటికే

By Srinivas
|
Google Oneindia TeluguNews

Pulla Padmavathi
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి వరంగల్ జిల్లాకు చెందిన శాసనమండలి సభ్యురాలు పుల్లా పద్మావతి షాక్ ఇచ్చారు. ఆమె తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆమె శుక్రవారం మీడియాతో మాట్లాడారు. తాను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ నాయకత్వంలో పని చేస్తానని చెప్పారు. అప్పుడు దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి తనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చిన కృతజ్ఞతతో జగన్ వర్గంలో పని చేశానని చెప్పారు. రాజకీయ భవిష్యత్తు దష్టిలో పెట్టుకొని తాను ఇక కాంగ్రెస్‌లో కొనసాగాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికపై ముఖ్యమంత్రి ప్రకటన సంతోషం కలిగించిందని, ఈ సందర్భంగా ఆయనకు కృతజ్ఞతలు అన్నారు.

జగన్ పార్టీ స్థాపించినప్పటి నుండి పుల్లా పద్మావతి ఆ పార్టీలో కీలక నేతగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్సీగా ఎన్నికైనప్పటికీ ఆమె దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డిపై అభిమానంతో జగన్ పార్టీలో పని చేశారు. జగన్ చేపట్టిన పలు కార్యక్రమాలు, దీక్షల్లో ఆమె పాల్గొన్నారు. అయితే ఇటీవల కొద్దికాలంగా ఆమె పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. రెండు రోజుల క్రితం ఆమె ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కూడా కలిశారు. కాగా పుల్లా పద్మావతిని అనర్హురాలిగా ప్రకటించాలంటూ సిఎల్పీ గతంలో మండలి చైర్మన్‌కు ఫిర్యాదు చేసింది. ఇప్పుడు ఆమె వెనక్కి తిరిగి రావడంతో ఫిర్యాదును వెనక్కి తీసుకునే అవకాశముంది.

English summary
It seems, MLC Pulla Padmavathi may returned to Congress from YSR Congress Party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X