హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ కేసులోనూ ఆచార్య: మిగతా నిందితులెవరు?

By Pratap
|
Google Oneindia TeluguNews

BP Acharya
హైదరాబాద్: ఎఫ్ఐ‌ఆర్‌లో లేని పేర్లు కొన్ని సిబిఐ కోర్టుకు సమర్పించిన చార్జిషీట్‌లో ఉన్నాయి. ఎమ్మార్ ప్రాపర్టీస్ కుంభకోణం కేసులో నిందితుడిగా ఉన్న ఐఎఎస్ అధికారి బిపి ఆచార్యను సిబిఐ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులోనూ నిందితుడిగా చేర్చింది. శనివారం సాయంత్రం హైదరాబాదులోని నాంపల్లి ప్రత్యేక కోర్టులో దాఖలు చేసిన చార్జిషీట్‌లో బిపి ఆచార్యను సిబిఐ తొమ్మిదో నిందితుడిగా చేర్చింది. జగన్ ఆస్తుల కేసులో బిపి ఆచార్యను హైకోర్టు అనుమతితో సిబిఐ విచారించిన విషయం తెలిసిందే. కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి అక్రమ మైనింగ్ కేసులో అరెస్టయిన మరో ఐఎఎస్ అధికారి శ్రీలక్ష్మిని సిబిఐ అధికారులు సిబిఐ అధికారులు విచారిస్తున్న విషయం తెలిసిందే.

వైయస్ జగన్ ఆస్తుల కేసులో నిందితుడు శరత్ చంద్రా రెడ్డి ట్రిడెంట్ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నారు. మరో నిందితుడు శ్రీనివాస రెడ్డి హెటిరో డ్రగ్స్ సంస్థ డైరెక్టర్. మరో నిందితుడు నిత్యానంద రెడ్డి అరబిందో ఫార్మా మేనేజింగ్ డైరెక్టర్. ఆ సంస్థలను కూడా సిబిఐ నిందితులుగా చేర్చింది. నిందితులుగా చేర్చిన జగతి పబ్లికేషన్స్ వైయస్ జగన్‌కు చెందిందనే విషయం తెలిసిందే. జననీ ఇన్‌ఫ్రా కూడా ఆయనకు సంబంధించిందేనని చెబుతారు. జగతి పబ్లికేషన్స్ వైస్ చైర్మన్ విజయసాయి రెడ్డి నేరాన్ని అంగీకరించినట్లు చెబుతున్నారు. వైయస్ జగన్ ఆస్తుల కేసులో విజయసాయి రెడ్డి ఒక్కరే అరెస్టయ్యారు.

వైయస్ రాజశేఖర రెడ్డి ప్రత్యేక ఆర్థిక మండళ్లను (సెజ్‌లను) మంజూరు చేసినందుకే వైయస్ జగన్ సంస్థల్లోకి పెట్టుబడులు వచ్చాయని సిబిఐ ఆరోపించినట్లు తెలుస్తోంది. ఎఫ్ఐఆర్‌లో లేని పేర్లు సిబిఐ చార్జిషీట్‌లోకి వచ్చాయి.

English summary

 IAS officer BP Acharya, who is accused in EMAAR case, is named in YS Jagan assets case also.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X