రికార్డ్ ఆదాయం: నవమి రోజు శ్రీవారికి రూ.5.73 కోట్లు
పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా హుండీ ఆదాయం కూడా ఎన్నో రెట్లు పెరుగుతూ వస్తోంది. ఐదేళ్ల నుంచి క్రమంగా రోజుకు రూ.కోటి దాటిన ఆదాయం నేడు రూ.5.73 కోట్లకు చేరింది. ఇక నగదుతోపాటు వెండి, బంగారం, ఆభరణాలు, ఇతర కానుకలను కూడా భక్తులు అధికమొత్తంలో సమర్పిస్తున్నారు. ఇప్పటి వరకూ అత్యధికంగా వచ్చిన ఆదాయం రూ.3.75 కోట్లు కాగా ఆదివారంతో సరికొత్త రికార్డు నమోదైంది. నిజానికి శ్రీరామ నవమిని పురస్కరించుకుని తిరుమలలో రద్దీ స్వల్పంగానే ఉంది. కానీ హుండీ ఆదాయం మాత్రం గణనీయంగా ఉండడం గమనార్హం. మార్చి31తో ఆర్థిక సంవత్సరం ముగిసే నేపథ్యంలో తమకు లాభంగా వచ్చిన సొమ్ము నుంచి పారిశ్రామిక వేత్తలు అధిక మొత్తంలో స్వామి వారికి కానుకలు సమర్పించుకోవడం పరిపాటి. ఈ క్రమంలోనే ఆదివారం ఓ అజ్ఞాత భక్తుడు రూ.మూడు కోట్ల వరకు హుండీలో వేసినట్లు తెలిసింది.
Comments
English summary
Barely three months after creating a new record, the hill shrine of Lord Venkateswara, reckoned as the world's richest Hindu temple, netted a whopping Rs 5.73 crore on Sunday on Srirama Navami.
Story first published: Monday, April 2, 2012, 8:28 [IST]