శ్రీకాకుళం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్‌కు మమ్మల్ని ఎదుర్కునే దమ్ము లేదు: బొత్స

By Pratap
|
Google Oneindia TeluguNews

Botsa Satyanarayana
శ్రీకాకుళం: తమకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగనైనా, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడైనా తమకు ఒక్కటేనని పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో పర్యటించిన ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. జగనైనా, చంద్రబాబైనా తమకు ఒక్కటేనని, వారిద్దరనీ ఒకే రకంగా ఎదుర్కుంటామని ఆయన చెప్పారు. తమ వంతు ప్రయత్నాలు తాము చేస్తామని ఆయన అన్నారు.

తమ పార్టీని ఎదుర్కునే సత్తా వైయస్ జగన్‌కు లేదని, తాము బలంగా ఉన్నామని ఆయన అన్నారు. కోర్టులో కేసు ఉన్నందున స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించలేకపోతున్నామని ఆయన అన్నారు. వచ్చే ఉప ఎన్నికలను ప్రభుత్వానికి రెఫరెండంగా భావించలేమని ఆయన అన్నారు. వచ్చే ఉప ఎన్నికల ఫలితాలను బట్టి కార్యాచరణ రూపొందించుకుంటామని ఆయన చెప్పారు.

మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలకు తాము బాధ్యత వహిస్తామని ఆయన చెప్పారు. అయితే తమ వెనక జరిగే లావాదేవీలతో, అవినీతితో తమకు సంబంధం లేదని ఆయన అన్నారు. ఒకవేళ తాము తప్పు చేసినట్లు రుజువైతే బాధ్యత వహిస్తామని ఆయన చెప్పారు. తప్పు చేసినట్లు రుజువైతే తల వంచుకుని సిగ్గుపడుతూ బాధ్యత వహిస్తామని ఆయన చెప్పారు. అవినీతి కార్యక్రమాలతో తమకు సంబంధం లేదని ఆయన అన్నారు.

త్వరలో జరిగే 18 శాసనసభా స్థానాల్లో తమ పార్టీ గెలిస్తే రాష్ట్రం సమైక్యంగా ఉంటుందని కాంగ్రెసు సీమాంధ్ర పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ అన్నారు. ముళ్ల కిరీటం పెట్టేవారికి ఓటేయవద్దని ఆయన ప్రజలను కోరారు.

English summary
PCC president Botsa Satyanarayana said that YSR Congress president YS Jagan has no strength to face Congress. He said that Congress will face YS Jagan and TDP president N Chandrababu Naidu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X