సయీద్పై ప్రశ్నించిన మన్మోహన్, చర్చిద్దామన్న జర్దారీ
ద్వైపాక్షిక అంశాలపై స్నేహపూర్వకంగా మాట్లాడుకున్నామని ఆయన చెప్పారు. చర్చలు నిర్మాణాత్మకంగా సాగినట్లు తెలిపారు. పాక్ రావాల్సిందిగా జర్దారీ ఆహ్వానించారని చెప్పారు. భారత్-పాక్ ద్వైపాక్షిక అంశాలపై ప్రధాని మన్మోహన్ సింగ్తో చర్చలు ఫలవంతంగా సాగినట్లు జర్దారీ చెప్పారు.
మన్మోహన్ సింగ్ను తమ పాకిస్తాన్కు ఆహ్వానించినట్లు చెప్పారు. అందుకు ఆయన ఒప్పుకున్నారని చెప్పారు. త్వరలోనే ఆయనను పాక్లో కలుసుకుంటానని చెప్పారు. భారత్తో తాను సత్సంబంధాలు కోరుకుంటున్నట్లు చెప్పారు. ఇరువురు ఉగ్రవాదం అంశంపై మాట్లాడుకుంటున్నట్లు చెప్పారు.
కాగా మన్మోహన్ ఇచ్చిన విందు అనంతరం జర్దారీ అజ్మీర్ దర్గాను దర్శించుకునేందుకు వెళ్లారు. అసిఫ్ అలీ జర్దారీతో పాటు ఆయన తనయుడు బిలావల్ జర్దార కూడా భారతదేశానికి వచ్చారు. వీరు సాయంత్రం దర్గాలో ప్రార్థనలు చేస్తారు. పాక్ ప్రధాని పర్యటన సందర్భంగా దర్గా వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. సందర్శకుల అనుమతిని వారు వచ్చినప్పుడు ఆపేస్తారు.