గాలి అక్రమ మైనింగ్ కేసులో ఆ ఇద్దరు కీలకం

విచారణకు రాకపోవడంతో ఆ ఇద్దరు వ్యక్తుల కోసం సిబిఐ అధికారులు గాలిస్తున్నట్లు సమాచారం. నోటీసులు జారీ అయిన తర్వాత ఆ ఇద్దరు వ్యక్తులు తమకు ఆరోగ్యం బాగాలేదని, త్వరలో వస్తామని చెప్పడంతో సిబిఐ మరి కొంత గడువు ఇచ్చింది. అయితే, నోటీసులు జారీ అయి నెల రోజులు పూర్తయినా వారి జాడ లేదు. దీంతో వారిద్దరి కోసం సిబిఐ అధికారులు గాలిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇటీవల చంద్రశేఖర్ భార్యను, మరో మహిళను సిబిఐ అదుపులోకి తీసుకుని విచారించినట్లు వార్తలు కూడా వచ్చాయి. చంద్రశేఖర్ ఆచూకీ కోసమే వారిని విచారించినట్లు చెబుతున్నారు. గాలి జనార్దన్ రెడ్డి గతంలో ఎనిమిది మంది వ్యక్తిగత సహాయకులు పనిచేసేవారని తెలుస్తోంది. వారిలో నలుగురు పూర్తిగా ఆయన వ్యక్తిగత, ఆర్థి, రాజకీయ వ్యవహారాలతో పాటు కర్ణాటక రాజకీయాలను పర్యవేక్షించేవారంటారు. మిగిలిన నలుగురు ఒఎంసి వ్యవహారాలను చూసుకునేవారిని సమాచారం.
ఒఎంసి వ్యవహారాలను చూసే నలుగురిలో ఆనందరెడ్డి, చంద్రశేఖర్ ఉన్నట్లు సిబిఐ అనుమానిస్తోంది. రెండు మూడు రోజుల్లో వీరిద్దరని తమ ముందు హాజరు పరచాలని సిబిఐ అధికారులు కుటుంబ సభ్యులకు చెప్పినట్లు తెలుస్తోంది. వారు హాజరు కాకపోతే కుటుంబ సభ్యులను బెంగళూర్ తరలిస్తామని కూడా హెచ్చరించినట్లు చెబుతున్నారు.
-
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్ -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' టీజర్ రివ్యూ: వరుసగా ఎన్ని హిట్స్ కొడతావ్ అన్నా..!! -
ఐఐటీ, నీట్ రాసే ఇంటర్ విద్యార్థులకు లోకేష్ గుడ్ న్యూస్..!












Click it and Unblock the Notifications