ఎయిర్ ఇండియాకు రూ. 30 వేల కోట్లు: అజిత్ సింగ్
ఎయిర్ ఇండియాకు రెండు వారాల్లో మొదటి డ్రీమ్ లైనర్ విమానం వస్తుంది. ఎయిర్ ఇండియా పునర్వ్యస్థీకరణ అవసరమని, ఎంతో కాలం ప్రజాధనాన్ని దానిపై ప్రభుత్వం ఖర్చు పెట్టలేదని అజిత్ సింగ్ అన్నారు. దేశంలోని పౌర విమానయాన రంగంలోకి విదేశీ పెట్టుబడుల అనుమతిపై ప్రభుత్వం ఏ నిర్ణయమూ తీసుకోలేదు.
ఆర్థిక పునర్వ్యస్థీకరణ ప్రణాళికలో భాగంగా ప్రభుత్వం 4 వేల కోట్ల రూపాయలను అదనపు ఈక్విటీగా అందిస్తుంది. దాంతో ఎయిర్లైన్స్ ఈక్విటీ బేస్ రూ. 7.345కి పెరుగుతుంది. పౌర విమాన యాన రంగంలోకి విదేశీ పెట్టుబడుల అనుమతిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోవడంపై పలువురు నిరాశకు లోనయ్యారు.
విదేశీ పెట్టుబడులను అనుమతి ఆర్థిక సమస్యల నుంచి బయట పడవచ్చునని కింగ్ ఫిషర్ అధినేత విజయ్ మాల్యా వంటివారు ఆశిస్తూ వచ్చారు. ప్రణబ్ ముఖర్జీ నేతృత్వంలోని ఆర్థిక మంత్రిత్వ శాఖ, అజిత్ సింగ్ నేతృత్వంలోని పౌర విమాన యానాల శాఖ స్థానిక కారియర్స్లో 49 శాతం వరకు విదేశీ సంస్థలు పెట్టుబడులు పెట్టడానికి అనుమతించాయి. దేశీ కారియర్స్లో పెట్టుబడులపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.